ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 12:08 PM IST

ETV Bharat / state

విద్యుత్​ పంపిణీలో జాప్యం ఛత్తీస్​గఢ్​ది - బాదుడు మాత్రం తెలంగాణకు - Telangana Electricity Purchases

Telangana Discoms Lost RS 2000 Crore: ఛత్తీస్​గఢ్​ నుంచి కరెంటు కొనుగోలులో తెలంగాణ డిస్కంలు భారీగా నష్టపోయాయి. ఈ విషయంపై ఛత్తీస్​గఢ్​ కరెంటు వ్యయంపై జాతీయ అప్పిలేట్​ ట్రైబ్యునల్​ తెలంగాణ డిస్కంలు పిటిషన్​ దాఖలు చేశాయి. దీనిపై తీవ్ర జాప్యమే జరుగుతోంది. 2018లో కేసు దాఖలైన ఇప్పటికీ విచారణే పూర్తి కాలేదు. మార్వా విద్యుత్​ ప్లాంట్​ వల్ల తెలంగాణకు రూ.2000 కోట్లపైనే నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Telangana Electricity Purchases
Telangana Electricity Purchases (ETV Bharat)

Telangana Electricity Purchase in Chhattisgarh : ఛత్తీస్​గఢ్​ కరెంటు వ్యయంపై తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థ(డిస్కం) జాతీయ విద్యుత్​ అప్పిలేట్​ ట్రైబ్యునల్​లో దాఖలు చేసిన అప్పీలుపై తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ విషయంపై 2018లోనే కేసు దాఖలు చేసినా ఇంతవరకూ విచారణే పూర్తి కాకపోవడం గమనార్హం. 2014లో తెలంగాణ ప్రభుత్వంతో ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం మార్వా వద్ద వెయ్యి మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మించిన ప్లాంటు నుంచి కరెంటు సరఫరా చేస్తామని ఒప్పందంలో తెలిపింది. అయితే ఈ ప్లాంటు నిర్మాణంలో 45 నెలల తీవ్ర జాప్యం జరగడంతో నిర్మాణ వ్యయం 40 శాతం పెరిగి తెలంగాణ డిస్కంలపై ఆర్థిక భారం భారీగా పడింది.

ఈ మార్వా ప్లాంటు నిర్మాణం 2012 కల్లా పూర్తి కావాలి. నిర్మాణ ప్రణాళిక ప్రకారం రూ.6,317.70 కోట్లు వ్యయంగా నిర్ణయించారు. కానీ ఆలస్యం కావడంతో వ్యయం పెరిగి ఆ మొత్తం రూ.8,999.43 కోట్లకు పూర్తి చేసినట్లు ఛత్తీస్​గఢ్​ విద్యుదుత్పత్తి సంస్థ ఆ రాష్ట్ర విద్యుత్​ నియంత్రణ మండలిలో 2018లో పిటిషన్​ దాఖలు చేసింది.

దీనిపై తెలంగాణ డిస్కంలు విద్యుత్​ అప్పిలేట్​ ట్రైబ్యునల్​లో అప్పీలు చేశాయి. వాస్తవాలు పరిశీలించకుండా సీఎస్​ఈఆర్​సీ తమపై అన్యాయంగా రూ.2,574 కోట్ల మేర అదనపు భారం మోపిందని తెలిపాయి. మార్వా ప్లాంటు నిర్మాణ ప్రణాళిక ప్రకారం మెగావాట్​కు సగటున రూ.5.89 కోట్లు అవుతుందనుకుంటే సుధీర్ఘ జాప్యంతో రూ. 8.89 కోట్లను దాటేసింది. 2014లో మార్వా ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్​గఢ్​తో ఒప్పందం చేసుకునే సమయానికే దాని నిర్మాణంలో 21 నెలల జాప్యం ఉంది. అయినా 2016 దాకా తెలంగాణకు కరెంటు రాలేదు.

అధికారుల తప్పిదం - ధరల భారాన్ని ప్రజలే భరించాల్సిన దుస్థితి - burden on electricity consumers

తుది వ్యయం ఆధారంగా :

  • ఛత్తీస్​గఢ్​ ఈఆర్​సీ 2018లో బహుళ వార్షిక టారిఫ్​ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం స్థిరఛార్జీల కింద 2018 నుంచి 2021 వరకు ప్రతి ఏడాది ఒక్కో రేటును పెంచుకుంటూ పోయాయి. అందుకు అదనంగా ఒక్కో యూనిట్​కు రూ.1.39 చొప్పున ఇందన ఛార్జీని తెలంగాణ డిస్కంల నుంచి వసూలు చేయాలని ఛత్తీస్​గఢ్​ ఈఆర్​సీ తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణ డిస్కంలు కూడా వ్యయం మరింత భారంగా మారిందని పిటిషన్​ వేసింది.
  • విద్యుత్​ ప్లాంటు నిర్మాణం కోసం జెన్​కోలు రుణాలు తీసుకోవడం ఆనవాయితీ అయితే దీని నిర్మాణం పూర్తయ్యేవరకు దీనిపై వడ్డీ భారం పడుతుంది. దీన్ని ఇంట్రస్ట్​ డ్యూరింగ్​ కన్​స్ట్రక్షన్​ అని పిలుస్తారు. మార్వా ప్లాంటు వ్యయం 40 శాతం పెరగడానికి ఐడీసీ భారీగా రూ.2,994.54 కోట్లు పడటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పడిన 95 శాతం వడ్డీని కూడా తెలంగాణ డిస్కంలే కట్టాలని ఛత్తీస్​గఢ్​ ఈఆర్​సీ తీర్పు చెప్పింది. కానీ అదే ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కోర్బా వద్ద నిర్మించిన మరో ప్లాంటు నిర్మాణంలో జరిగిన జాప్యంతో అదనపు వడ్డీలో 50 శాతం కట్టాలని ఛత్తీస్​గఢ్​ ఈఆర్​సీ చెప్పడం గమనార్హం.
  • మార్వా ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి ఛత్తీస్​గఢ్​ డిస్కంలే ముందుగా పీపీఏ చేసుకోవడంతో తెలంగాణ డిస్కంలు ప్లాంటు నుంచి కాకుండా ఛత్తీస్​గఢ్​ డిస్కంల నుంచే పీపీఏ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పడు ఆ డిస్కంలు యూనిట్​కు అదనంగా 7 పైసలు కమీషన్​ వసూలు చేయడంతో తెలంగాణ డిస్కంలపై మరింత భారం పడినట్లు అయింది.

మండే ఎండలకు కరెంట్ మీటర్​ గిర్రున తిరుగుతోందా - ఇలా చేస్తే 'బిల్లు' మన కంట్రోల్​లోనే! - Electricity Bill In aP

ABOUT THE AUTHOR

...view details