ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నంద్యాల జిల్లాలో విషాదం - మట్టి మిద్దె కూలి నలుగురు మృతి - Four Killed in Slab Collapsed

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 7:24 AM IST

Updated : Aug 2, 2024, 10:05 AM IST

Four Killed in Slab Collapsed in Nandyal District: నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో చోటు చేసుకుంది.

Four Killed in Slab Collapsed in Nandyal District
Four Killed in Slab Collapsed in Nandyal District (ETV Bharat)

Four Killed in Slab Collapsed in Nandyal District : నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటు చేసుకుంది. రాత్రి బాగా పొద్దుపోయాక ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో భార్యాభర్తలు గురుశేఖర్‌ రెడ్డి (45), దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10) మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి మృతదేహాలను గ్రామస్థులు వెలికి తీస్తున్నారు. వీరి మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో చదువుకుంటోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

నంద్యాల జిల్లాలో విషాదం - మట్టి మిద్దె కూలి నలుగురు మృతి (ETV Bharat)
Last Updated : Aug 2, 2024, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details