ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు - Rat Bite to Students in Medak

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 9:37 PM IST

Rat Bite to Students in Medak సర్కారీ బడుల్లో చదివేందుకు ఆ విద్యార్థిలు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. పులిసిపోయిన ఆహారం, తలుపులు లేని బాత్ రూంలు, కిటికీలు వారికేం కొత్త కాదు. కాని ఇటీవలే వారికి కొత్త సమస్య వచ్చింది. హాస్టల్లో ఇప్పుడు ఎలకలతో సావాసం చేయాల్సి వస్తోంది. దీంతో వారు నిద్రలేక, భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. అయినా, 12 మంది బాలికలను ఎలకలు కరవడంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ ఘటన ఎక్కడా అనుకుంటున్నారా..?

Rat Bite to School Students in Medak
Rat Bite to School Students in Medak (ETV Bharat)

Rat Bite to School Students in Medak : తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్​ జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్​టీయూలో చట్నీ పాత్రలో ఎలుక, రామాయంపేట ఆదర్శ పాఠశాల వసతి గృహంలోని అల్పాహారంలో బల్లి పడిన సంఘటనలు మరువకముందే మళ్లీ ఇదే తరహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లాలోని రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని 12మంది విద్యార్థులను ఎలకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

విద్యార్థినులపై లైంగిక వేధింపులు - ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంపై పోక్సో కేసు

తొమ్మిదో తరగతి చదువుతున్న సదరు బాధిత అమ్మాయిలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్టల్ వద్ద కుక్కలు, ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు తమ సమస్యలను మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్న పాపన పోలేదని వాపోయారు. 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

'స్కూల్​లో, హాస్టల్​లో పరిశుభ్రత లేదు. ఎక్కడ చెత్త అలానే ఉంటుంది. దీని వల్ల పిల్లలకు ఎలుకలు కరిచాయి. 12 మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదు' - విద్యార్థిని తండ్రి

పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్లే : పాఠశాల హాస్టల్ చుట్టూ పరిసరాలు కంపు కొడుతుండడంతో దోమలు వస్తున్నాయని, కుక్కలు సంచరిస్తూ తమపై దాడి చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు కుక్కలు, ఎలుకలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై పాఠశాల ప్రిన్సిపల్​ వరూధిని స్పందించారు. ఎలుకలు సంచరించకుండా ర్యాట్​ ప్యాడ్లు, బోన్లు ఏర్పాటు చేస్తామని, పరిసరా ప్రాంతం అంతా శుభ్రం చేయిస్తామని తెలిపారు. విద్యార్థులను ఆసుపత్రిలో చికిత్స చేయించామని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

'మాకు గత మూడు రోజులు నుంచి ఎలుకలు కరుస్తున్నాయి. ఒకరోజు ముగ్గురికి ఎలుకలు కరిచాయి. దీంతో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడు 12 మందిని కరిచాయి. ఇప్పుడు వాళ్ల తల్లిదండ్రులు స్కూల్​కు వచ్చి వారిని ఆసుపత్రిలో చూపించారు'- పాఠశాల విద్యార్థి

పాఠశాలలోని అల్పాహారంలో బల్లి - అస్వస్థతకు గురైన విద్యార్థులు

గిరిపుత్రులు కాదు వీరు సరస్వతి పుత్రులు- సొంత డబ్బుతో స్కూల్ నిర్మాణం - Tribals have built their own school

ABOUT THE AUTHOR

...view details