ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రామోజీ గ్రూపు పెద్ద మనసు - వరద బాధితులకు రూ. 5 కోట్లు భారీ విరాళం - Eenadu Relief Fund to Flood Victims

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 9:33 PM IST

Updated : Sep 4, 2024, 10:05 PM IST

Ramoji Group donates Rs.5 crore to flood victims in Telugu states: తెలుగురాష్ట్రాల్లో వరద బాధితుల కోసం రామోజీ గ్రూప్‌ భారీ విరాళం ప్రకటించింది. ఇరు రాష్ట్రాలకు కలిపి రూ.5 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. బాధితులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు 'ఈనాడు రిలీఫ్‌ ఫండ్‌'ను ఏర్పాటు చేసింది.

Ramoji Group Donation
Ramoji Group Donation (ETV Bharat)

Ramoji Group Donates Rs.5 crore to Flood Victims in Telugu States : ఎప్పుడు విపత్తులు, ఆపదలు తలెత్తినా ప్రజలకు అండగా నిలిచే రామోజీ గ్రూపు మరోసారి తన పెద్ద మనసు చాటుకుంది. కుండపోత వర్షాలకు కకావికలమైన తెలుగు రాష్ట్రాల్లో బాధితుల సహాయార్థం 5 కోట్ల రూపాయలతో ఈనాడు సహాయ నిధిని ప్రకటించింది. వరదలు ఇరు రాష్ట్రాల్లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి. బాధితులు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.

ప్రకృతి ప్రకోపంతో తలెత్తిన ఈ భయానక పరిస్థితుల్లో బాధితులకు ప్రజలంతా కలిసి అండగా నిలవడం, సామాజిక బాధ్యతని రామోజీ గ్రూపు పిలుపునిచ్చింది. ఈనాడు సహాయ నిధిని బాధితుల తక్షణ సహాయ చర్యలకు కేటాయించినట్లు పేర్కొంది. తీవ్రంగా ప్రభావితమైన వారికి సాయం అందించడం కేవలం మద్దతే కాదని ఈ చీకటి సమయంలో వెలుగు నింపుతుందని రామోజీ గ్రూపు పేర్కొంది. బాధితులకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈనాడుతో చేతులు కలపాలని కోరింది. వరద బాధితులకు సాయం చేయాలనుకునేవారు ఈనాడు రిలీఫ్ ఫండ్‌ యూనియన్ బ్యాంక్‌ ఖాతా నంబరు 370602010006658కు పంపాలని కోరింది.

Last Updated : Sep 4, 2024, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details