ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రామోజీరావు అనుభవాలు, ప్రసంగాలను పుస్తక రూపంలో భావితరాలకు అందించాలి: వెంకయ్య నాయుడు - Ramoji Rao Memorial Meet

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 17, 2024, 8:44 PM IST

Updated : Jul 17, 2024, 10:36 PM IST

Ramoji Group Chairman Ramoji Rao Memorial Meet: ఆఖరిశ్వాస వరకూ ప్రజాపక్షం వహించిన ఏకైక వ్యక్తి దివగంత రామోజీరావు అని సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్‌లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహంచారు. రామోజీరావు అనుభవాలు, ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చి భావితరాలకు అందించాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కొనియాడారు.

Ramoji Rao Memorial Meet
Ramoji Rao Memorial Meet (ETV Bharat)

Ramoji Group Chairman Ramoji Rao Memorial Meet Brahmakumaris:యువతరం రామోజీరావు జీవితాన్ని చదివి ఆచరించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సూచించారు. సమయ పాలన, క్రమశిక్షణకు రామోజీరావు మారుపేరు అని తెలిపారు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. రామోజీరావు అనుభవాలు, ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొచ్చి భావితరాలకు అందించాలని కోరారు.

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ తెలంగాణలోని సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్‌లో బ్రహ్మకుమారీస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. రామోజీరావు కుటుంబ సభ్యులు ఈనాడు ఎండీ కిరణ్​, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్​, ఫిల్మ్​సిటీ ఎండీ విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, కీర్తి సోహన, బృహతి, దివిజ హాజరయ్యారు. ఈ సభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్​ హాజరయ్యారు. అలాగే నటులు మురళీమోహన్, సుమన్​, చదలవాడ శ్రీనివాస్​, ప్రసన్న కుమార్​, ఏపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్​ సంస్మరణ సభలో పాల్గొన్నారు. అలాగే బ్రహ్మకుమారీస్​ పాల్గొన్నారు.

'కఠోరమైన క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు' యువత ఈ లక్షణాలను అలవర్చుకోవాలి - Ramoji Rao memorial meeting

"రామోజీరావు వల్ల నేను జీవితంలో ఎంతో లాభపడ్డాను. రామోజీరావు జర్నలిస్టుల ఫ్యాక్టరీ. మీడియాను ప్రజలకు అత్యంత చేరువ చేయడంలో రామోజీరావు ముందు ఉన్నారు. మీరు ఎవరి పక్షం అని నేను అడిగితే తాను ప్రజల పక్షమని రామోజీరావు చెప్పారు. ఆయన ఆఖరి శ్వాస వరకు ప్రజాపక్షమే వహించారు."- ఎం.వెంకయ్య నాయుడు, భారత మాజీ ఉపరాష్ట్రపతి

రామోజీరావు ఎప్పుడు విదేశాలకు వెళ్లలేదు : రామోజీరావు ఎప్పుడూ విదేశాలకు వెళ్లింది తాను చూడలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన కుటుంబాన్ని ఎంతో విలువలతో పెంచారని పేర్కొన్నారు. రామోజీరావు అనుభవం ఎంతో విలువైనదని అన్నారు. తెలుగు అంటే ఆయనకు ఎంతో ప్రేమని కొనియాడారు. మాతృభాషలో విద్యాభ్యాసం చేసినా ఉన్నతంగా ఎదగవచ్చని నిరూపించిన వ్యక్తి రామోజీ రావు అని గొప్పగా చెప్పారు. రామోజీరావు సింగిల్​ పీస్​ ఆయనకు ఆయనే సాటి అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు.

"ఒకసారి అమెరికాలో తానా మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఈ సభకు రామోజీరావు హాజరయ్యారు. నేను మిమ్మల్ని పొగడడానికి రాలేదు. విమర్శించడానికి వచ్చాను అని చెప్పారు. మీలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. నేను ఒక పేషెంట్​ను తీసుకొని వచ్చి అక్కడ నిలబెడతాను. మీ డాక్టర్లు అందరూ అతనికి పరీక్ష చేసి అతని కులం, ఏ వర్గానికి చెందిన వ్యక్తే తేల్చి చెబితే నేను మీ అందరినీ ఒప్పుకుంటాను. తమ దగ్గర కులం అనేది ఉండకూడదు. మీరు ఇంత దూరం వచ్చి బాగా చదువుకుని కులం అంటే ఎలా అని హెచ్చరించారు. అంతటి మహానుభావుడు రామోజీరావు."- మురళీ మోహన్​, సినీ నటుడు

పెదపారుపూడికి రామోజీరావే పెద్ద దిక్కు - సంస్మరణ సభకు పెద్దఎత్తున హాజరైన గ్రామస్థులు - pedaparupudi Villagers on RamojiRao

Last Updated : Jul 17, 2024, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details