తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత కేసులపై కొత్త దర్యాప్తు - పెండింగ్‌ కేసుల భారం దించుకునే దిశగా పోలీస్ శాఖ - తెలంగాణ పెండింగ్ కేసులు

Police Special Drive on Pending Cases in Telangana : రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్​ కేసులపై పోలీసులు దృష్టి సారించారు. ఆధారాలు లేని వాటిని చట్టబద్ధంగా కొట్టివేయడానికి యోచిస్తున్నారు. వివాదాస్పదంగా ఉన్న కేసులను తిరిగి దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నారు.

Pending Cases in Telangana
Police Special Drive on Pending Cases in Telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 1:47 PM IST

Police Special Drive on Pending Cases in Telangana :కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పెండింగ్ కేసులకు చట్టబద్ధమైన ముగింపు చెప్పడానికి పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. దీంతో పాటు వివాదాస్పదంగా ఉన్న కేసులపైనా దృష్టి సారించి మళ్లీ దర్యాప్తునకు ఆదేశించాలనే యోజన చేస్తోంది. రాష్ట్రంలో సంవత్సరానికి సగటున లక్షన్నర కేసులు నమోదవుతుంటాయి. అంతకు ముందు పరిష్కారం కాని కేసులు వీటికి తోడవుతుంటాయి. గత సంవత్సరం కూడా దాదాపు లక్షన్నర కేసులు నమోదు కాగా 2022 వరకు పరిష్కారం కాని 45,511 కేసులో వీటిలో కలిశాయి. అంటే మొత్తం కేసుల్లో నాలుగో వంతు పాత ఫిర్యాదులే ఉంటున్నాయి.

25 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుల్లో అనేక మందిని సీఐడీ అధికారులు ఇప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేశారు. 2008లో ఓ చీటింగ్ కేసు నమోదు చేని దానిని పక్కన పెట్టారు. ఇలా ఎందుకు జరిగిందని ఆ కేసు గురించి ఇప్పుడు ఆరా తీస్తున్నారు. పోలీసు శాఖలో ఒక్కసారి కేసు పెండింగ్​లో పడితే ఇక అది అలానే కొనసాగుతూనే ఉంటుంది. బాధితులు పోలీస్​ స్టేషన్​ చుట్టూ తిరిగిన విసిగి పోవాలే తప్పా ఆ కేసు ముందుకు పోతది అనుకుంటే ప్రయోజం ఉండదు.

కరీంనగర్‌లో జోరుగా భూ కబ్జాలు - అక్రమార్కులకు కళ్లెం వేస్తున్న పోలీసులు

2000లో జరిగిన కొన్ని నేరాల దర్యాప్తు ఇప్పటికి పూర్తి కాలేదు. కానీ చట్టం ప్రకారం ఒక్కసాపరి నమోదైన తర్వాత దాన్ని పక్కా పరిష్కరించాల్సిందే. ఆధారాలు దొరకని పక్షంలో అదే విషయాన్ని న్యాయస్థానానికి తెలిపి అర్థవంతమైన ముగింపు పలకాలి. కానీ చాలామంది అధికారులు వాటిని పరిష్కరించకుండా, చట్టబద్ధంగా ముగింపు పలకకుండకా అలాగే వదిలేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెండింగ్​ కేసుల మధ్య సగటున సంవత్సరానికి కనీసం50వేల వరకు ఉంటోంది. ఒక్క హైదరాబాద్​లోనే నగరంలో వేలల్లే పేరుకుపోయాయని ఇటీవల జరిగిన సమీక్ష సమావేశాల్లో వెల్లడైంది.

రాజకీయ ఒత్తిళ్లతోనూ కొన్ని కేసులు నమోదు అవుతున్నట్లు బయటపడింది. నేతల ప్రత్యర్థులను బెదిరించేందుకు తప్ప వీటిలో ఎలాంటి ఆధారాలు ఉండటం లేదు. ఇలాంటి వాటిని గుర్తించి న్యాయ సలహా తీసుకుని ఆ కేసులన్ని మూసివేయాలని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం మహబూబ్​నగర్​లో ఓ ప్రజాప్రతినిధిపై సంబంధించిన కేసుపై ఆ సమయంలోనే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

పోలీసులు ఉన్నది ప్రజల కోసం - వారిని భయాందోళనలకు గురి చేయడానికి కాదు : హైకోర్టు

నిజామాబాద్​ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధిపైనా హత్యాయత్నానికి సంబంధించి బంజారాహిల్స్​ పోలీస్​స్టేషన్లో నమోదైంది. వీటిని మళ్లీ దర్యాప్తు చేయించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కమిషనర్​గా మహేందర్​రెడ్డి ఉన్నప్పుడు ప్రతివారం పెండింగ్ కేసుల మేళా పెట్టేవారు. స్టేషన్ల వారీగా బయటకు తీసి వాటిని పరిష్కరించేవారు. ఇప్పుడు కూడా అదే తరహా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు వివాదాస్పదంగా అనిపించిన వాటిని తిరిగి దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నారు.

సంక్రాంతికి ఊరెళ్తున్నారా - ఇళ్లు గుల్లవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

కల్తీ కల్లులో ఆల్ఫ్రాజోలం డ్రగ్ వినియోగం - తయారీ కేంద్రాన్ని సీజ్ చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details