ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనసేన నేత కుటుంబంపై దాడి- వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు - Murder Attempt Case File

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 3:44 PM IST

Police File Murder Attempt Case Against Perni Kittu: జనసేన నేత కుటుంబంపై దాడికి పాల్పడిన మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేయగా అందులో ఏ1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరుతో దూషించారని వైసీపీకి చెందిన దళిత మహిళ ఫిర్యాదుతో కర్రి మహేష్​పై కూడా కేసు నమోదు చేశారు.

Police File Murder Attempt Case Against Perni Kittu
Murder Attempt Case on Perni Kittu (etv bharat)

Police File Murder Attempt Case Against Perni Kittu:కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్​లో జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి కిట్టు అనుచరులు దాడి చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. A1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు. చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్​పై కూడా హత్యాయత్నం కేసు నమోదైంది. పేర్ని కిట్టు మినహా మిగిలిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో జనసేన నేత కర్రి మహేశ్ ​పై కూడా కేసు నమోదు చేశారు. కర్రి మహేశ్​తో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరుతో దూషించారని వైసీపీకి చెందిన దళిత మహిళ నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు.

పెట్రెగిపోయిన పేర్ని కిట్టు అనుచరులు - జనసేన నేత ఇంటిపై దాడి - Perni Kittu Follower Attack

బందరులో వైసీపీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు పోటీ చేస్తున్నారు. గురువారం బందరు 8వ డివిజన్‌ విశ్వబ్రాహ్మణ కాలనీలో ఆడంబరంగా ప్రచారం నిర్వహించారు. అదే కాలనీలో జనసేన కార్యకర్త కర్రి మహేష్‌ నివాసం ఉంటున్నారు. స్వర్ణకారుడైన ఆయన గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసి ఓడిపోయారు. పేర్ని కిట్టు ప్రచార వాహనం మహేష్‌ నివాసానికి చేరుకోగానే పెద్దఎత్తున బాణసంచా కాల్చగా, నిప్పురవ్వలు ఇంట్లోకి దూసుకెళ్లాయి. దీంతో అక్కడున్న మహిళలు బాణసంచా ఎందుకు కాలుస్తున్నారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన పేర్ని కిట్టు అనుచరులు మహేష్‌ నివాసంపై దాడి చేశారు.

రెచ్చిపోయిన పేర్ని కిట్టు గ్యాంగ్‌ - జనసేన కార్యకర్త కుటుంబంపై పైశాచిక దాడి - PERNI KITTU FOLLOWERS ATTACK

కారు అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేశారు. మహేష్‌ భార్య హేమలతపై దాడి చేసి ఆమె మెడలోని తాళిబొట్టును లాగేశారు. అడ్డుకున్న ఆమె అత్తగారు జ్ఞానప్రసూనాంబను నెట్టేయడంతో ఆమె తలకు గాయమైంది. హేమలతపై పైశాచికంగా పేర్ని కిట్టు అనుచరులు వ్యవహరించారు. అక్కడే ఉన్న హేమలత కుమారుడు సాయికృష్ణ రామబ్రహ్మం, కుటుంబసభ్యులు గోకుల్‌, నాగబాబులపైనా చేయి చేసుకున్నారు.

ఇది జరుగుతున్న సమయంలోనే అక్కడికి మహేశ్ చేరుకున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా అతడి ​పైనా దాడి చేశారు. తమను రక్షించాలంటూ బాధితులు పోలీస్​ స్టేషన్​కు ఫోన్​ చేసినా పోలీసులు స్పందించలేదు. ప్రచార వాహనంలోనే కూర్చున్న పేర్ని కిట్టు తన అనుచరులను ప్రోత్సహించారు. వారంతా అక్కడి నుంచి వెళ్లిన తర్వాత బాధితులు పక్కనే ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

గంజాయి మత్తులో బార్​లో వీరంగం- వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల దాడిలో ఇద్దరికి గాయాలు - YCP Leader Attack

ABOUT THE AUTHOR

...view details