ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎర్రచందనం స్మగ్లింగ్​'పై పవన్​ కీలక ఆదేశాలు- పారిశ్రామిక కాలుష్యంపైనా మంత్రి సమీక్ష - pawan kalyan on Red Sandalwood

PAWAN KALYAN ON RED SANDALWOOD: ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి నేపాల్‌కు తరలిపోయిన ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అదే విధంగా కాలుష్య నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని పవన్‌ ఆదేశించారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 23, 2024, 9:16 AM IST

Updated : Jun 23, 2024, 9:23 AM IST

pawan kalyan on Red Sandalwood
pawan kalyan on Red Sandalwood (ETV Bharat)

PAWAN KALYAN ON RED SANDALWOOD: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో వెలువడే కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మరోవైపు మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయి నేపాల్ దేశంలో దొరుకుతున్న ఎర్ర చందనాన్ని వెనక్కి తీసుకురావాలని ఆయన సూచనలు జారీ చేశారు. నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దొరికిందని మంత్రి స్పష్టం చేశారు. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్​ను బలోపేతం చేస్తామని తెలిపారు.


జనవాణికి వచ్చే సమస్యల పరిష్కారాలను నేరుగా పర్యవేక్షిస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ - Pawan Kalyan Janavani

Pawan Kalyan Visits Assembly Premises: రాష్ట్ర శాసన సభలో పని చేసే హౌస్ కీపింగ్ సిబ్బందిగా ఉన్న 154 మంది మహిళలు తమ సమస్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లారు. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నామని, తాము అమరావతి ప్రాంత రైతు కూలీలమని తెలిపారు. శాసనసభ రెండో రోజు స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభకు ఉదయమే వచ్చిన పవన్ కల్యాణ్ అసెంబ్లీ ప్రాంగణమంతా కలియ తిరిగి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో, సెక్యూరిటీతో సరదాగా మాట్లాడుతూ వారితో మమేకమయ్యారు. సిబ్బందికి ఫొటోలు ఇచ్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ శాసనసభను పరిశీలించారు.

శాసనసభ హౌస్ కీపింగ్ సిబ్బంది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ సమస్యలను చెప్పుకొన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బంది మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 154 మంది వరకు శాసనసభలో పనిచేస్తున్నామని, రాజధాని ప్రాంత రైతు కూలీలమని ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. 8 సంవత్సరాల కిందట రూ.6 వేలకు ఉద్యోగంలో చేరామని ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ పరిధిలో ఉన్నామని తెలిపారు.

న్యాయం చేస్తామని పవన్ హామీ: అమరావతి రైతు కూలీలుగా ఉన్నందున నెలకు రూ.2500 భత్యం వచ్చేదని, తరువాతి రోజుల్లో కీపింగ్ ఉద్యోగం ఉందని చెప్పి ఆ భత్యం నిలిపివేశారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రతను కల్పిస్తూ పురపాలక ఉద్యోగులుగా గుర్తించాలని వేడుకున్నారు. హౌస్ కీపింగ్ ఉద్యోగుల సమస్యను ఆసాంతం విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో 11 సీట్లకు పరిమితమైంది: పవన్‌ కల్యాణ్ - Deputy CM Pawan in Assembly

Last Updated : Jun 23, 2024, 9:23 AM IST

ABOUT THE AUTHOR

...view details