ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏ నిమిషానికి ఏ రాయి పడుతుందో - వయనాడ్ ఘటనతో విశాఖ కొండవాలు నివాసితుల్లో భయాందోళన - Vizag Hill Residents Panic

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 4:56 PM IST

Panic Among people Living in Hilly Areas of Visakh: కేరళలోని వయనాడ్ కొండచరియల ఘటనతో దేశ వ్యాప్తంగా కొండవాలు ప్రాంతాల్లో నివసించే జనాలకు భయం రెట్టింపు పెరిగింది. అయితే ఇప్పుడు విశాఖలోని కొండవాలు నివాసితులు అదే భయానికి గురవుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా ఎప్పుడు ఏ రాయి మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

vizag_hill_residents_panic
vizag_hill_residents_panic (ETV Bharat)

Panic Among people Living in Hilly Areas of Visakh:చుట్టూ కొండలు అందులోనే ఇళ్లు. వర్షాకాలం వచ్చిందంటే చాలు బండరాళ్లు జారి రోడ్లు ఛిద్రమవుతున్నాయి. చినుకు పడితే చాలు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు విశాఖలోని కొండవాలు నివాసితులు. ఎప్పుడు ఏ రాయి మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కేరళలోని వయనాడ్ కొండచరియల ఘటనతో స్థానికుల్లో భయం రెట్టింపు అయింది. తక్షణమే రక్షణ గోడ నిర్మించకపోతే పెద్ద ప్రమాదం తప్పదంటున్న స్థానికులు వాపోతున్నారు.

విశాఖలో కొండవాలు ప్రాంతాలలో నివసించే జనాభా సంఖ్య ఎక్కువ. హనుమంతువాక, పెద్ద గదిలి, చిన్న గదిలి, కైలాసపురం, విశాలాక్షినగర్, వెంకోజీపాలెం ఇలా పలు ప్రాంతాల్లో ఎక్కువ మంది జనాభా కొండవాలు ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారంతా పేద, మధ్య తరగతి ప్రజలే. ముఖ్యంగా వర్షాకాలంలో వర్షపు నీటి ధాటికి బండరాళ్లు దొర్లి కిందకు పడుతుంటాయి. దీంతో జనాలు భయాందోళనకు గురవుతుంటారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో బండరాళ్లు దొర్లి ఇళ్ల మీదకు వస్తాయని అక్కడి జనాభా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్టీరింగ్ పట్టిన అనంత అమ్మాయి - ఆర్టీసీలో చేరేందుకు శిక్షణ - Anantapur Lady Driver

కొండ మీద నుంచి నీరు కిందకి వచ్చేలా డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అంతే కాకుండ అక్కడ రక్షణగా గోడలు కట్టాలని కోరుతున్నారు. గతంలో పెద్దగదిలిలో వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్​లు పడిపోయిన ఘటనలు జరిగాయి. అటువంటి ఘటనలు గుర్తు చేసుకుంటే కొండవాలు ప్రాంత నివాసులు భయపడుతున్నారు. చినుకు వర్షం పడితే చాలు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ రక్షణకోసం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రాజధాని అమరావతిలో ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల పరిశీలన - IIT Teams Visit Amaravati Today

తాగునీటి పథకాన్ని అటకెక్కించిన వైఎస్సార్సీపీ - 15 గ్రామాల ప్రజలకు తంటాలు - Drinking Water Problem in Pedana

ABOUT THE AUTHOR

...view details