ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిశ్రమల్లో భద్రతా చర్యలు - ప్రమాదాల నివారణ దిశగా కూటమి సర్కారు చర్యలు - industries safety measures

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఎనిమిది ప్రభుత్వ శాఖలు విస్తృత తనిఖీలు నిర్వహించనున్నాయి.

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

Published : 4 hours ago

పరిశ్రమల్లో భద్రతా చర్యలు - ప్రమాదాల నివారణ దిశగా కూటమి సర్కారు చర్యలు
Safety_measures_in_industries (Etv Bharat)

Officers Check Industries Safety Measures in Anakapalli : పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆగస్టు నెలలో ఎసెన్షియా, సినర్జిన్‌ కంపెనీల్లో జరిగిన వరుస ప్రమాదాలతో కూటమి సర్కారు అప్రమత్తమైంది. పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వసుధా మిశ్రా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ రెండు పరిశ్రమలను పరిశీలించి ఉన్నత అధికారులతో సమీక్షలు జరిపింది. తాజాగా మిగతా కంపెనీల్లోనూ భద్రత ప్రమాణాల అమలుపై జిల్లా వ్యాప్తంగా హైపవర్​ బృందం విస్తృత తనిఖీలకు శ్రీకారం చుట్టింది. 8 శాఖల అధికారులు వారంలో 3 రోజుల పాటు తనిఖీలు చేపట్టాలి.

అచ్యుతాపురం ఫార్మా ఘటన అప్డేట్​ - గంటన్నర ముందే కంపెనీలో డేంజర్ బెల్స్ - Atchutapuram SEZ Incident Updates

మావన తప్పిదాల వల్ల ప్రమాదాలు : జిల్లా పరిధిలో సుమారు 200 పైగా రెడ్‌ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. వీటి అన్నింటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి లోపాలు ఉంటే సరిదిద్దాలి. భవిష్యత్తులో ప్రమాదాలు జరకుండా సూచనలు చేయాల్సిన బాద్యతా కమిటీపై ఉంది. పరిశ్రమల్లో భద్రత (Safety Measures) అనేది యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులు సమష్టి కృషితోనే సాధ్యమవుతుంది. పరిశ్రమల్లో యాజమాన్యాలే అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించాలి. ముఖ్యంగా నిర్ధిష్టమైన పనిచేసే విధానం (SOP) సక్రమంగా అమలుచేయాలి. యంత్ర పరికరాల్లో నాణ్యతా లోపాలు, ఉద్యోగులు, కార్మికులకు సరైన అవగాహన లేకపోవడం, సుశిక్షితులైన వారిని నియమించుకోకపోవడం ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.

వాస్తవానికి పరిశ్రమల్లో 98% మావన తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అలా జరగకుండా జాగ్రత్త పడటం మన చేతుల్లోనే ఉంది. పక్క కంపెనీలో కదా ప్రమాదం జరిగింది. మాకేం సంబంధం? అని యాజమాన్యం, కార్మికులు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ కంపెనీలో ప్రమాదం ఎందుకు జరిగింది. మన పరిశ్రమలో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అని ఒకసారి పరిశీలించుకోవాలి. అప్పుడే పరిశ్రమల్లో ప్రమాదాలు చర్యలు జరగకుండా అరికట్టవచ్చు.

అచ్యుతాపురం ఫార్మా ఘటన - ప్రమాదం వెనుక అధికారుల నిర్లక్ష్యం! - Atchutapuram SEZ Incident

భద్రతా చర్యలు గాలికి వదిలేశారు : వైఎస్సార్సీపీ హయాంలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు లేవు. నడుస్తున్న పరిశ్రమలను పరిశీలించిన దాఖలాలు లేవు. గడిచిన 5 ఏళ్లులో జరిగిన ప్రమాదాలే దీన్ని నిరూపిస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్‌లో (LG Polymers) విషవాయువులు విడుదలైన తర్వాత విపత్తుల నిర్వహణ శాఖ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై గెజిట్‌ రూపొందించింది. దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. థర్డ్‌పార్టీ వాళ్లకు సేఫ్టీ ఆడిట్‌ బాధ్యతను కట్టబెట్టి చేతులు దులుపుకొంది. పరిశ్రమల యాజమాన్యం, అధికారులు, ఏజెన్సీలు కుమ్మక్కై అందినంత దండుకుని నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.

మూడు నెలలపాటు తనిఖీలు : ఓ వైపు ఉన్నత స్థాయి కమిటీ తనిఖీలు చేపడుతోంది. మరో వైపు పరిశ్రమలను కాలుష్య నియంత్రణ మండలి (PCB), కర్మాగారాలు, ఔషధ నియంత్రణ, బాయిలర్స్, ఏపీఐఐసీ (APIIC), అగ్నిమాపక, కార్మికశాఖల అధికారులు సంయుక్తంగా అన్ని కంపెనీలను పరిశీలించనున్నారు. రోజుకు 3 పరిశ్రమల చొప్పున వారంలో 3 రోజుల పాటు ఈ తనిఖీలు చేపట్టాలి. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు (Safety Measure) శాఖల వారీగా తనిఖీలు చేసి యాజమాన్య ప్రతినిధులతో సంతకాలు తీసుకుంటున్నారు. జిల్లాలో 200 పైగా పరిశ్రమలుండడంతో 3 నెలల పైగానే ఈ తనిఖీలు కొనసాగనున్నాయని ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ నారాయణ వెల్లడించారు.

అచ్యుతాపురం దుర్ఘటన- బాధిత కుటుంబాల్లో అంతులేని ఆవేదన - Tragedy in Victims Families

ABOUT THE AUTHOR

...view details