ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేయూత దక్కని చేనేత కుటుంబాలు- ఇతర రాష్ట్రాలకు ఆగని వలసలు - AP Weavers Problems

Nandigam Weavers Migration: రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా ఖాదీ వస్త్రాలు గత వైభవం కోల్పోతున్నాయి. ఏళ్లుగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, మరోపక్క చేనేతకు గిట్టుబాటు లేక వందలాది నేతన్న కుటుంబాలు వలస వెళ్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేతకు చేయూత అందిస్తే, పూర్వ వైభవం వస్తుందని నేతన్నలు పేర్కొంటున్నారు.

Nandigam_Weavers_Migration
Nandigam_Weavers_Migration

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 3:20 PM IST

Nandigam Weavers Migration :చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో నేతన్న కుటుంబాలు వృత్తికి దూరమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి రాయితీలు రాక కష్టానికి తగిన గిట్టుబాటు ధర లేక శ్రీకాకుళం జిల్లాలో వందలాది చేనేత కుటుంబాలు వలస బాట పడుతున్నాయి. తరతరాలుగా సంప్రదాయ చేతి వృత్తి చేసుకుంటూ గౌరవంగా బతికిన ఊరిలోనే రోజు కూలీలుగా మారి చాలీచాలని ఆదాయంతో పూట గడవడమే కష్టంగా ఉన్న దయనీయ స్థితిలో చేనేత కుటుంబాలు బతుకులీడుస్తున్నాయి.

ఇతర రాష్ట్రాలకు వలసల వెల్లువ : శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో పెద్ద తామరపల్లి, నర్సిపురం, రౌతుపురం, సైలాడ, కాపు తెంబూరు, గ్రామాల్లో వందలాది చేనేత కళాకారుల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ తయారు చేసిన ఖాదీ వస్త్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఏళ్లుగా ప్రభుత్వం చేనేతకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం మరో పక్క చేనేతకు గిట్టుబాటు లేక వందలాది నేతన్న కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, ముంబై, సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, తదితర ప్రాంతాలకువలసవెళుతున్నారు. ఆ ప్రాంతాల్లో రోజు వారీ కూలీలుగా మారుతున్నారు.

AP Weaving Sector in YSRCP Government మాటల్లోనే మగ్గానికి మహర్దశ..! 3.5 లక్షల చేనేతల్లో సాయం దక్కింది 80 వేల మందికే..!

నాటి కళ నేడు తప్పింది : ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో 350 పైగా కుటుంబాలు మగ్గాలతో నేత నేస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 20కి చేరిందంటే నేతన్నలు వలస బాట పడుతున్న దుస్థితిని తెలియజేస్తోంది. ప్రస్తుతం మగ్గాలు ఉన్న వారు కూడా చేసిన పనికి గిట్టుబాటు ధర రాకపోవడంతో రోజు వారి కూలీలుగా మారి కుటుంబాలను పోషిస్తున్నారు.

వైఎస్సార్ నేతన్న నేస్తంలో వివక్ష : ప్రభుత్వం చేనేత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనపడటం లేదు. ప్రభుత్వం ఏడాదికి నేతన్న నేస్తం కింద 24 వేల రూపాయలు అందిస్తున్నా దానికి వివిధ కొర్రీలు పెడుతుండడంతో చాలా మందికి లబ్ధి చేకూరలేదని చేనేత కార్మికులు అంటున్నారు. నేతన్నలు అంటే కేవలం మగ్గాలు ఉన్న వారికి మాత్రమే అది కూడా వారికి అనుకూలమైన వారికి మాత్రమే వైఎస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham) అందిస్తూ మిగిలిన వారికి అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

AP Weavers Problems: నాడు దోస్తీ.. నేడు కనీసం పట్టించుకోని పరిస్థితి

సాయం చేస్తే పూర్వ వైభవం : ఇప్పటికే పూర్తి స్థాయిలో చేనేత వృత్తి కనుమరుగవుతుందని, భవిష్యత్ తరాల వారికి ఈ వృత్తి పట్ల ఆసక్తి లేదని నేతన్నలు అంటున్నారు. చేనేత వృత్తిలో ఆదాయం రాకపోవడంతో తమ పిల్లలు కూడా వీటిని నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేతకు చేయూత అందించి, కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తే చేనేతకు పూర్వ వైభవం వస్తుందని నేతన్నలు అంటున్నారు.

Handloom Weavers Problems ప్రభుత్వాలు మారుతున్న.. మారని చేనే'తలరాత'లు

ABOUT THE AUTHOR

...view details