ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Updated : 17 minutes ago

ETV Bharat / state

'హైడ్రా అంటే భరోసా, బాధ్యత - ఇప్పుడు కాకపోతే చెరువులను ఎప్పటికీ కాపాడుకోలేం' - Musi River Front Development

Musi River Front Development Project : హైదరాబాద్​లోని మూసీ నది పరిసరాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. 2026 జూన్‌లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ తెలిపారు. ఇప్పుడు కాకపోతే చెరువులు, నాళాలను ఎప్పటికీ కాపాడుకోలేమని చెప్పారు.

HYDRA officers on Demolish
HYDRA officers on Demolish (ETV Bharat)

Musi Catchment Survey :చట్టానికి లోబడి హైడ్రా, అధికారులు పనిచేస్తున్నారని మూసీ ప్రాజెక్టు ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. హైదరాబాద్​లోని మూసీ నిర్వాసితులను ఎవరినీ బలవంతంగా తరలించడంలేదని ఆయన స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులతో సామరస్యంగా మాట్లాడి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు తరలిస్తున్నామని, నిర్వాసితుల్లో దాదాపు 90 శాతం మంది ఖాళీ చేసేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మూసీ నిర్వాసితుల్లో ఎవరికైనా పట్టాలు ఉంటే రెట్టింపు ధర ఇస్తున్నట్లు తెలిపారు.

మురికి కూపంలా మూసీ : హైదరాబాద్​లో 1927లో మూసీకి వచ్చిన వరదల వల్ల భారీ నష్టం జరిగిందని దాన కిశోర్ పేర్కొన్నారు. గతంలోనూ నిర్వాసితులను తరలించారని తెలిపారు. హైదరాబాద్‌లో ఇటీవల దాదాపు 9 సెం.మీ పైగా వర్షాలు వచ్చాయని, చిన్న వర్షాలకే హైదరాబాద్‌ ముంపునకు గురవుతోందన్నారు. గతంలో మూసీ సుందరీకరణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కోటి జనాభా ఉందని, మూసీ పరివాహక ప్రాంతం మురికికూపంలా మారిందన్నారు. దానిని మార్చాలని దానకిశోర్ స్పష్టం చేశారు.

మూసీ నిర్వాసితుల్లో పట్టాలు ఉంటే రెట్టింపు ధర ఇస్తున్నాం : దానకిశోర్ (ETV Bharat)

Musi River Encroachment :మూసీకి వరదలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలేనని దానకిశోర్ తెలిపారు. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకొని క్షేత్ర పర్యటనకు వెళ్తామని పేర్కొన్నారు. మూసీ బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని దాన కిశోర్ స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన ఇళ్లను ఇస్తున్నట్లు దానకిశోర్ వెల్లడించారు

Hydra Ranganath on Buchamma Suicide :పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే సంస్థ లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం అనేది రాజ్యాంగంలో భాగమని, పరిశుభ్రమైన వాతావరణం జీవించే హక్కులో భాగమని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని అందుకే ఆ బాధ్యత హైడ్రాకు ఉందని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొన్ని కట్టడాలను కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారన్నారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామని రంగనాథ్ వివరించారు.

ఆస్పుపత్రిలో రోగులు లేరూ : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సీఎం హైడ్రాను తీసుకొచ్చారని రంగనాథ్ స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యతనని వెల్లడించారు. అమీన్‌పూర్‌లో ప్రభుత్వం భూములు పెద్దఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. అమీన్‌పూర్‌లో గతంలో ఓ హాస్పిటల్‌ను కూల్చినా మళ్లీ నిర్మించారన్నారు. అమీన్‌పూర్‌లో ఆసుపత్రిని కూల్చివేశారని ప్రచారం చేస్తున్నారని అందులో రోగులెవరూ లేరని చెప్పారు. ఆసుపత్రిని కూల్చేముందు వీడియోరికార్డు చేసినట్లు రంగనాథ్ పేర్కొన్నారు

హైడ్రాను బూచిగా చూపిస్తే భవిష్యత్‌ తరాలకు నష్టమే : రంగనాథ్‌ (ETV Bharat)

"ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశాం. కానీ దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదు. ప్రజలు నివసిస్తున్న భవనాలను అసలు కూల్చలేదు. ఇటీవల కూకట్‌పల్లి నల్లచెరువులో ఆక్రమణలను కూల్చివేశాం. ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయలేదు. హైడ్రా మీద భయంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుందని, బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి చాలా బాధపడ్డాను. హైడ్రా వస్తుందని బుచ్చమ్మను కొందరు భయపెట్టారు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని దీనిని బూచిగా చూపించవద్దు." - రంగనాథ్, హైడ్రా కమిషనర్

'ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు చెరువులు, నాలాలను కాపాడుకోలేం. సరైన సమయం ఇచ్చిన తర్వాతే ఆక్రమణలు కూల్చివేస్తున్నాం. పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదు. ఓవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయి. విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోతుందనే చర్యలు తీసుకోలేదు. విద్యాసంవత్సరం ముగిశాక కాలేజీలపై చర్యలు తప్పవు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. జన్వాడ ఫామ్‌హౌస్‌ 111 జీవో పరిధిలో ఉంది. 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు' అని రంగనాథ్ వ్యాఖ్యానించారు.

దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్‌ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు? : హోంమంత్రి అనిత - Home Minister Comments On Jagan

కల్తీ నెయ్యిలో లేదు - ఆవులోనే ఏదో జరిగిందండీ: తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు - Tammineni Sitaram on Tirupati laddu

Last Updated : 17 minutes ago

ABOUT THE AUTHOR

...view details