ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్ బీమా పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది: మంత్రి వాసంశెట్టి - MINISTER ESI HOSPITAL INAUGURATION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 7:45 PM IST

Updated : Aug 19, 2024, 10:39 PM IST

Minister Subhash Inaugurated Gunadala ESI New Hospital: జగన్ హయాంలో వైఎస్సార్ బీమా పేరుతో ఆ పార్టీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. విజయవాడ గుణదల ఈఎస్ఐ నూతన హాస్పటల్​ని ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్ఐ హాస్పటల్​ని నిర్వీర్యం చేసి అవినీతి మయం చేసారని మంత్రి ఆరోపించారు.

minister_esi_hospital_inaguration
minister_esi_hospital_inaguration (ETV Bharat)

Minister Subhash Inaugurated Gunadala ESI New Hospital:వైఎస్సార్ బీమా పేరుతో గత ప్రభుత్వం కోట్ల రూపాయల కుంభకోణం చేసిందని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుపుతామని అన్నారు. విజయవాడ గుణదల ఈఎస్ఐ నూతన హాస్పటల్​ని మంత్రి సుభాష్ ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్ఐ హాస్పటల్​ని నిర్వీర్యం చేసి అవినీతి మయం చేసారని ఆరోపించారు. ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేసేందుకు సరైన వైద్య పరికరాలు కూడా లేవన్నారు. ఈఎస్​ఐ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీని చేపట్టలేదని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ గత ప్రభుత్వ నేతలు పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈఎస్ఐ హాస్పటల్​లో ప్రతి రోగానికి వైద్యం చేస్తారని మంత్రి తెలిపారు. పాత భవనం శిథిలావస్థకు చేరుకోవటంతో తాత్కాలిక భవనాన్ని నిర్మించామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా భవనంలో 100 పడకల ఆసుపత్రి కొనసాగిస్తున్నామని తెలిపారు. 10 లక్షల రూపాయల వరకు ఈఎస్ఐ నుంచి వైద్య చికిత్సకు అవకాశం ఉంటుందని అన్నారు. గత ప్రభుత్వ నేతలు దళారులతో వ్యవస్థను నడిపించారని ఆరోపించారు. కార్మిక శాఖా మంత్రిని పక్కన పెట్టి సజ్జల, ధనుంజయ రెడ్డి ఈఎస్ఐ వ్యవస్థని భ్రష్టు పట్టించారని మంత్రి ధ్వజమెత్తారు.

మందుబాబులకు అడ్డాలుగా ఉద్యాన వనాలు - వైఎస్సార్సీపీ పాలనలో నిర్లక్ష్యం- నేడు ఆహ్లాదానికి ఆటంకం - YSRCP Neglected Parks Modernization

వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులపై కక్ష పూరితంగా అక్రమ కేసులు బనాయించి వేధించారని మంత్రి సుభాష్ అన్నారు. వేధింపుల్లో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడుపై కేసులు నమోదు చేసి వేధించారని మండిపడ్డారు. అసెంబ్లీలో వీటిని ప్రశ్నిస్తామనే ముఖం చూపించలేక వైఎస్సార్​సీపీ నేతలు రాలేకపోతున్నారని తెలిపారు. ఇప్పటికే కొందరు వైఎస్సార్​సీపీ నేతలు పక్క పార్టీ వైపు చూస్తున్నారన్నారు. భవిష్యత్​లో ఈఎస్ఐ నూతన ఆసుపత్రి శాశ్వత భవనాన్ని 300 పడకలతో నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 10 మంది కార్మికులున్న ప్రతీ ఒక్క సంస్థను ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈఎస్ఐలో మెంబర్​షిప్ సంఖ్యను 25 లక్షలకు చేరుస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.

ఏపీలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులు - రాష్ట్రంలోని అవకాశాలను వివరించిన మంత్రి లోకేశ్ - Foxconn Representatives Meet Lokesh

ఫైబర్‌నెట్ అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్ - మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్​ - EX MD Madhusudan Reddy Suspend

Last Updated : Aug 19, 2024, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details