ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిమ్మకాయ నీళ్ల పేరుతో రూ.28 లక్షలు దిగమింగుతావా జగన్- ప్రజాధనం మెక్కడానికి సిగ్గులేదా?' - Nara Lokesh Fires on YS Jagan

Minister Nara Lokesh Fires on YS Jagan: ప్రజాధనం దోపిడీపై మాజీ సీఎం జగన్​పై మంత్రి లోకేశ్ ధ్వజమెత్తారు. నిమ్మకాయ నీళ్ల పేరుతో 28 లక్షల రూపాయల ప్రజల సొమ్మును దిగమింగుతావ అని లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్లంటూ జనం సొమ్మును దోచేశారన్నారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 7:51 PM IST

Minister Nara Lokesh Fires on YS Jagan
Minister Nara Lokesh Fires on YS Jagan (ETV Bharat)

Minister Nara Lokesh Fires on YS Jagan: వైఎస్సార్సీపీ పాల‌న‌లో గ‌డ్డం గ్యాంగ్ గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోస‌మంటూ జ‌నం సొమ్ము 28 ల‌క్షలు దోచేశారని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ దుయ్యబట్టారు. జ‌నం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్లలా 28 ల‌క్షలు దిగ‌మింగేశారని ఆరోపించారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేద‌లకు మంజూరు చేయ‌డానికి 3 ల‌క్షల నుంచి 4 ల‌క్షలు దండుకున్నారని విమర్శించారు. దోపిడీకి హద్దులేదా జగన్, ప్రజాధనం మెక్కడానికి సిగ్గులేదా అని లోకేశ్ ధ్వజమెత్తారు.

జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్ల కోసం 28 లక్షలు దిగ‌మింగేశారని ఆరోపించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేశారన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని లోకేశ్ పేర్కొన్నారు.

"ఉపాధ్యాయ బదిలీల్లో భారీ అవినీతి" మాకెందుకు చెడ్డపేరు?- స్పష్టం చేసిన మంత్రి లోకేశ్ - nara Lokesh Prajadarbar

Lokesh on Alluri Sitarama Raju Birth Anniversary: స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఘన నివాళి అర్పించారు. అల్లూరి సీతారామరాజు తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అని పిలుపునిచ్చారని లోకేశ్ పేర్కొన్నారు.

Lokesh on Pingali Venkayya Death Anniversary: మువ్వన్నెల జాతీయ పతాకం రూపకర్త, తెలుగుజాతి కీర్తి పతాకం పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు. మన గుండెల నిండా ఉన్న జాతీయ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగు వారు కావడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ నిర్వహణ ఏర్పాట్ల పై మంత్రి నారా లోకేశ్ సమీక్ష - Nara Lokesh Review On Skill census

Lokesh Visit Temple: మంత్రి నారా లోకేశ్ నేడు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠం రాజు కొండూరులోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాన్ని పరిశీలించి, పనులు జరుగుతున్న తీరు గురించి ధర్మకర్తలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భక్తుల సౌకర్యం కోసం మెరుగైన రోడ్లు, పార్కింగ్ సౌకర్యం, పరిశుభ్రత ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసి దేవాలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చెయ్యడానికి ప్రణాళిక సిద్ధం చెయ్యాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు.

సీఎం 4.0ను చూస్తారు - చంద్రబాబు, లోకేశ్​ మధ్య ఆసక్తికర సంభాషణ - Chandrababu and Lokesh Conversation

ABOUT THE AUTHOR

...view details