తెలంగాణ

telangana

ETV Bharat / state

ధనవంతుల ఇంట్లోనే పనికి చేరతారు - అదును చూసి దోచేస్తారు - MASSIVE THEFT IN BUSINESSMAN HOUSE

హిమాయత్‌నగర్‌ మినర్వా హోటల్ గల్లీలోని ఇంట్లో భారీ చోరీ - చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులు అరెస్టు - సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు చోరీ చేసిన నిందితులు

Massive Theft In Businessman House
Massive Theft In Businessman House (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 11:31 AM IST

Updated : Feb 13, 2025, 7:04 PM IST

Massive Theft In Businessman House :హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. హిమాయత్‌నగర్‌ మినర్వా హోటల్ గల్లీలోని ఇంట్లో సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాలను నిందితులు చోరీ చేశారు. ఇంటి యజమాని అభయ్‌ కేడియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో కేసును ముగించారు.

దోపిడీలకు అడ్డొస్తే హత్యే : నిందితుల నుంచి రూ.3 కోట్ల విలువైన బంగారు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మార్వాడి, జైన్లలో ధనవంతులను లక్ష్యంగా చేసుకుని నిందితులు వారి ఇంట్లో పనివాళ్లలాగా చేరుతున్నారని తెలిపారు. నిందితులపై 2024 జనవరిలో వృద్ధురాలిని హత్య చేసి దోపిడీకి పాల్పడ్డ నేరం కేసులు నమోదయ్యాయని కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. నిందితుల పేర్లు వరుసగా మొల్హూ, శుషీల్‌ (బిహార్‌), బసంతి ఆర్తి (బంగాల్‌)గా ఉన్నాయి. అదను చూసి దోపిడీలకు పాల్పడుతూ అడ్డొస్తే హత్య నిందితులు హత్య చేస్తున్నారని వెల్లడించారు.

"హైదరాబాద్ కమిషనరేట్​లో వేగవంతంగా అన్ని విభాగాలను అనుసంధానిస్తూ ఈ కేసును దర్యాప్తు చేసిన ఉదాహరణ ఇది. టాస్క్​ఫోర్స్​ను ఇందులో చేర్చడం వల్ల ఈ కేసు వేగంగా పరిష్కారం అయ్యింది. నిందితులు రూ.3 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించారు. అది మార్కెట్​లో 5 కోట్ల కన్నా ఎక్కువ విలువను కలిగి ఉంది. ఇంత భారీ దొంగతనాన్ని వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నాం" -సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

అసలేం జరిగిందంటే : హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో ఫిబ్రవరి 12న భారీ చోరీ జరిగింది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురైనట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో నిందితులను నాగ్‌పుర్‌ సమీపంలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

పోలీసుల కథనం ప్రకారం :హిమాయత్‌ నగర్‌లో నివాసం ఉండే వ్యాపారి రోహిత్ కెడియా ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 10న దుబాయ్‌కి వెళ్లారు. ఈ క్రమంలోనే దొంగలు ఇంట్లో పడి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును దొంగిలించారు. తన యజమాని ఇంట్లో దొంగలు పడ్డారని బుధవారం(ఫిబ్రవరి 12న) సాయంత్రం కేడియా మేనేజర్‌ అభయ్‌ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్​టీంను రప్పించి ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బీరువాలో దాచి ఉన్న రూ.2 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు చోరీకి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో వేలిముద్రలను కూడా సేకరించారు. ఇది తెలిసిన వారు చేసిన పనే అని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసి సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలించారు. కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులను నాగ్​పూర్​లో అరెస్టు చేసి హైదరాబాద్​కు తీసుకొచ్చారు.

పోచారం ఐటీకారిడార్​లో భారీ చోరీ - రూ.2 కోట్లు సహా 28 తులాల బంగారం స్వాహా - Massive Theft in Medchal District

తాళం వేసిన ఇళ్లే ఆదొంగల టార్గెట్ - నగరంలో బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు - Massive theft in Shameerpet

Last Updated : Feb 13, 2025, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details