తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరేందర్ కిడ్నాప్‌ - చిత్రహింసలు పెట్టి వదిలిపెట్టిన కిడ్నాపర్లు - MRPS Narendra Kidnap Case Update - MRPS NARENDRA KIDNAP CASE UPDATE

MRPS Narender Kidnap Case Update : ఎమ్మార్పీఎస్‌ నాయకుడు రామేశ్వరం నరేందర్, ప్రవీణ్ కుమార్‌ కిడ్నాప్‌ కేసును నార్సింగి పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన వీరిద్దరినీ నిందితులు వదిలిపెట్టారు. ఈ సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు తీవ్రంగా గాయపడ్డ బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. కిడ్నాపర్లు ఎందుకు అపహరించారో ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు అంటున్నారు. మరోవైపు ఇదే వ్యవహారంలో నార్సింగి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఓ స్తిరాస్థికి సంబంధించిన విషయంలో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

MRPS Narendra Kidnap Case In Rangareddy
MRPS Narendra Kidnap Case Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 12:43 PM IST

MRPS Narender Kidnap Case In Rangareddy : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బృందావన్‌ కాలనీలోని రూ.కోట్ల విలువైన ఒక స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుంది. దీనిపై మాట్లాడేందుకు గండిపేట మండలం నెక్నాంపూర్‌ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్‌ నాయకుడు రామేశ్వరం నరేందర్, తన అనుచరుడు ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి స్థలం దగ్గరికి రావాలని కోరారు. అక్కడికి వెళ్లిన ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు సెల్‌ఫోన్‌ సాంకేతిక ఆధారాలతో ఆచూకీ కోసం ప్రయత్నించినా చిక్కలేదు. దీంలో కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.

గాలింపు చేస్తున్న పోలీసులు వివాదానికి కారణమైన స్థలం దగ్గరికి వెళ్లారు. అక్కడ ఓ ఖాళీ జాగాలో అలజడిగా ఉండటంతో పోలీసులు వెళ్లి అక్కడ ఉన్న వారిని ప్రశ్నించారు. భూమి ఎవరిది? ఇక్కడ ఎందుకున్నారని అడుగుతున్న సమయంలో వారంతా ఒక్కసారిగా పోలీసులపైకి కత్తులు, హాకీ కర్రలతో తిరగబడ్డారు. ఎదురు దాడిని ఊహించని పోలీసులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై అదనపు బలగాలను రప్పించారు. దాంతో వారిని చూసి రౌడీలు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటపడిన పోలీసులు అహ్మద్‌ఖాన్, షేక్‌ హమ్దన్, మహ్మద్‌ జాఫర్, మసూద్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

పోలీసు అధికారుల విధులను అడ్డుకున్నందుకు ఈ నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. నరేందర్, ప్రవీణ్‌ కిడ్నాప్‌లో ఈ నలుగురి పాత్ర ఉన్నట్లు తేలితే నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. నిందితులపై పలు ప్రాంతాల్లో చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత మూడు రోజులుగా ఆచూకీ లేని నరేందర్, ప్రవీణ్‌కుమార్‌ శనివారం ఉదయం నగరంలో ప్రత్యక్షమయ్యారు. కిడ్నాపర్లు గత మూడు రోజులుగా వీరిద్దర్ని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ దాడి చేసినట్లు తెలుస్తోంది. నలుగురి అరెస్టు విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు నరేందర్, ప్రవీణ్‌కుమార్​ను వదిలిపెట్టారు. తీవ్రంగా గాయపడ్డ బాధితులు కిడ్నాపర్ల సమాచారం చెప్పలేని పరిస్థితి ఉండటంతో పోలీసుల దర్యాప్తు ఆలస్యమవుతోంది.

గచ్చిబౌలిలో వ్యాపారవేత్త కిడ్నాప్​ - ఖాళీ బాండ్లపై సంతకం చేయించుకొని వదిలేసిన దుండగులు - Gachibowli Kidnap Case

వ్యక్తిని కిడ్నాప్‌ చేసి 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ - సైబర్‌క్రైమ్‌ ఏసీపీ, తలకొండపల్లి ఎమ్మార్వోపై కేసు నమోదు - Kidnapping case against ACP and Mro

ABOUT THE AUTHOR

...view details