విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్కు నోటీసులు - సమయం కోరిన మాజీ సీఎం - KCR SUMMONED IN POWER PURCHASE DEAL - KCR SUMMONED IN POWER PURCHASE DEAL
Justice L.Narasimha Reddy Commission Notice To EX CM KCR : ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు. కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30 వరకు సమయం అడిగారని చెప్పారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 2:10 PM IST
Notices To KCR in Chhattisgarh Power Purchase Deal : యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తెలిపారు. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జులై 30వ తేదీ వరకు సమయం కోరగా జూన్ 15వరకు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకుంటే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేశారు.
- ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చాం: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- అర్వింద్, ఎస్.కె.జోషికు నోటీసులు ఇచ్చాం: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- సురేష్ చందా, అజయ్ మిశ్రాకు నోటీసులు ఇచ్చాం: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- జూన్ 15 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించాం: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- ఇప్పటి వరకు 25 మంది వివరణ ఇచ్చారు: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- వివరణ సంతృప్తిగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందే: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- టెండర్ ప్రక్రియ లేకుండా ఇచ్చారు: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- అత్యవసరంగా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి టెండర్ ప్రక్రియకు వెళ్ళలేదు అన్నారు
- భద్రాద్రిలో మాత్రమే సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఏర్పాటు చేశారు: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
- కోదండరామ్, రఘు, వేణుగోపాలరావు కూడా వివరణ ఇచ్చారు: జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి