ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రపంచానికి తలమానికంగా విశాఖ డేటా సిటీ: మంత్రి లోకేశ్‌ - LOKESH ON VISAKHA DATA CITY

ఏపీ డిజిటల్‌ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేశ్

AP Digital Technology Summit 2025
AP Digital Technology Summit 2025 (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 3:41 PM IST

Lokesh on Visakha Data City : విశాఖ కేంద్రంగా డేటా సిటీని ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది ప్రపంచానికే తలమానికంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్​లో భాగంగా ఆంధ్రప్రదేశ్​ను డిజిటల్ హబ్​గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీప్ టెక్ సమ్మిట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

AP Digital Technology Summit 2025 : ఏపీ పునర్నిర్మాణంలో ఐటీదే కీలకపాత్రని లోకేశ్ పేర్కొన్నారు. ఇలాంటి డీప్ టెక్ సదస్సులు అందుకు దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇస్తున్నారని వెల్లడించారు. ఒక్క కియా పరిశ్రమ రాయలసీమ ముఖచిత్రాన్నే మార్చిందని గుర్తు చేశారు. డ్రోన్ల టెక్నాలజీని సహాయ కార్యక్రమాల్లోనూ వినియోగిస్తున్నామని వివరించారు. రతన్ టాటా మంచి దార్శనికుడని, దేశ పురోగతి కోసం తపించేవారని లోకేశ్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details