తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు - విద్యార్థులు, ఉద్యోగుల ఇబ్బందులు - METRO TRAINS DELAY AT MIYAPUR

మియాపూర్-అమీర్‌పేట్‌ మధ్య ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు - మెట్రో రైళ్ల ఆలస్యంతో విద్యార్థులు, ఉద్యోగుల ఇబ్బందులు

METRO TRAINS DELAY AT MIYAPUR
METRO TRAINS DELAY AT MIYAPUR (Eఊన Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 9:20 AM IST

Metro Trains Delay : హైదరాబాద్​ మెట్రో రైలు సేవల్లో అంతరాయం కలిగింది. సాంకేతిక కారణాలతో మియాపూర్​- అమీర్​పేట్​ మధ్య మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా అమీర్​పేట్​- హైటెక్ ​సిటీ, నాగోల్​- సికింద్రాబాద్​ మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాంకేతిక లోపంతోనే సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. మెట్రో రైళ్ల ఆలస్యంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సాంకేతిక కారణాలతోనే మెట్రో సేవల్లో జాప్యం : మెట్రోరైలు సేవల్లో అంతరాయం కలగి ఆలస్యంగా నడవడంపై మెట్రో అధికారులు స్పందించారు. సాంకేతిక కారణాలతోనే మెట్రో సేవలకు కాసేపు అంతరాయం కలిగినట్లుగా తెలిపారు. ఉదయం కొన్ని మెట్రో రైలు సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం మెట్రో రైలు సేవలను పునరుద్ధరించామని తెలిపారు.

"ఉదయం కొన్ని మెట్రో రైలు సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. వాటికారణంగానే మెట్రో సేవలకు కాసేపు అంతరాయం కలిగింది. ప్రస్తుతం మెట్రో సేవలను పునరుద్ధరించాం"- ఎల్​ అండ్​ టి మెట్రో అధికారులు

మరో రెండేళ్లు సర్దుకుపోవాలంటున్న మెట్రో అధికారులు

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం - మేడ్చల్‌, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details