ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ అక్రమాస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చుక్కెదురు - Jagan illegal assets case

HC dismissed Nimmagadda Prasad Quash Petition: జగన్ అక్రమాస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్​కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. నిమ్మగడ్డ ప్రసాద్ వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 3:20 PM IST

Updated : Jul 8, 2024, 4:56 PM IST

Nimmagadda Prasad Quash Petition
Nimmagadda Prasad Quash Petition (ETV Bharat)

HC dismissed Nimmagadda Prasad Quash Petition: జగన్ అక్రమాస్తుల కేసు నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్​కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాన్ పిక్ ఛార్జిషీట్ నిందితుల నుంచి నిమ్మగడ్డ ప్రసాద్​ను తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. నిమ్మగడ్డ ప్రసాద్ వేసిన క్వాష్ పిటిషన్​ను కొట్టివేస్తూ జస్టిక్ కె.లక్ష్మణ్ తీర్పు వెల్లడించారు. కేసు నుంచి తొలగించాలని కోరుతూ సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేసుకోవడానికి అనుమతినిచ్చింది. నిమ్మగడ్డ డిశ్చార్జి పిటిషన్ వేస్తే ఈ తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు తెలిపింది.

గుంటూరు, ప్రకాశం జిల్లాలో వాన్ పిక్ ప్రాజెక్టు పేరిట వైఎస్ సర్కారు సుమారు 13వేల ఎకరాల భూములను కేటాయించింది. వాన్ పిక్ ప్రాజెక్టు ముసుగులో నిమ్మగడ్డ ప్రసాద్ సుమారు 1426 కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం 165 కోట్ల రూపాయలకే దక్కించుకున్నారని సీబీఐ అభియోగం. ప్రతిఫలంగా జగన్​కు నిమ్మగడ్డ ప్రసాద్ 854 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఛార్జిషీట్​లో దర్యాప్తు సంస్థ వెల్లడించింది. నిమ్మగడ్డ ప్రసాద్​తో పాటు ఛార్జిషీట్​లోని నిందితులపై సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది.

అయితే తన పేరు తొలగించాలంటూ నిమ్మగడ్డ ప్రసాద్ వేసిన క్వాష్ పిటిషన్​పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. వాన్ పిక్ కుట్రలో నిమ్మగడ్డ ప్రసాద్​దే కీలక పాత్ర అని సీబీఐ వాదించింది. సుమారు 280 మంది సాక్షుల వాంగ్మూలాలు, వెయ్యికి పైగా డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే సీబీఐ కోర్టు అభియోగాలను స్వీకరించిందని వివరించింది. నిమ్మగడ్డ ప్రసాద్ సుమారు 900 ఎకరాలను ఇతరులకు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని సీబీఐ తెలిపింది. ముడుపులను జగన్ కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించినందుకే వాన్ పిక్ ప్రాజెక్టును, రాయితీలను కల్పించారని వాదించింది.

జగన్ అక్రమాస్తుల కేసు- డిశ్చార్జి పిటిషన్లపై విచారణకు సిద్దమవుతున్న సీబీఐ కోర్టు - YS Jagan Illegal Assets Case

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు, వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధం లేదని నిమ్మగడ్డ ప్రసాద్ వాదించారు. వాన్ పిక్ ప్రాజెక్టు కోసం భూములు ఉచితంగా పొందలేదని, 13 వేల ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా ఎక్కువే చెల్లించామని వాదించారు. వాన్ పిక్ ప్రాజెక్టులపై ప్రభుత్వం, రస్ అల్ ఖైమా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, సీబీఐ ఊహాజనితంగా అభియోగాలు మోపిందని నిమ్మగడ్డ వాదించారు. ఇరువైపుల వాదనలు విని రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు, నిమ్మగడ్డ ప్రసాద్ క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది.

కేసు నుంచి తొలగించాలని కోరుతూ సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేసేందుకు అనుమతివ్వాలని నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు న్యాయవాది కోరగా అందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. నిమ్మగడ్డ ప్రసాద్ డిశ్చార్జి పిటిషన్ వేస్తే అందులోని అంశాల ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని, ఈ తీర్పును పరిగణనలోకి తీసుకోవద్దని సీబీఐ కోర్టుకు హైకోర్టు తెలిపింది. వాన్ పిక్ చార్జిషీట్​లో విశ్రాంత ఐఆర్ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి డిశ్చార్జి పిటిషన్​ను కూడా గతంలో హైకోర్టు కొట్టివేసింది. నిందితుల జాబితా నుంచి వాన్ పిక్ ప్రాజెక్టు పేరును తెలంగాణ హైకోర్టు తొలగించగా, సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

గడువు విధించినా ప్రయోజనం శూన్యం - జగన్‌ పిటిషన్లను పరిష్కరించని సీబీఐ కోర్టు - discharge petitions in CBI Court

Last Updated : Jul 8, 2024, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details