ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో హీరో అఖిల్‌ అక్కినేని, ఏపీ సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ - HERO AKHIL AKKINENI AT TIRUMALA

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్

Tirumala_Darshan
HERO AKHIL AKKINENI AT TIRUMALA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2024, 12:03 PM IST

HERO AKHIL AKKINENI AT TIRUMALA: తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, సినీ నటుడు అక్కినేని అఖిల్ శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి అభిషేక సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని వేరు వేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details