ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయచోటిలో టీచర్‌ మృతిపై చర్యలు - హెచ్ఎం, ఉపాధ్యాయుడి సస్పెన్షన్ - RAYACHOTI TEACHER SUSPICIOUS DEATH

రాయచోటిలో టీచర్‌ మృతిపై అధికారుల చర్యలు - ప్రధానోపాధ్యాయుడు, మరో ఉపాధ్యాయుడు సస్పెండ్

rayachoti_teacher_case
rayachoti teacher case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2024, 10:24 PM IST

HM and Teacher Suspended on Teacher Death Case: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయుడు ఏజాష్‌ అహ్మద్‌ (42) అనుమానాస్పద మృతి ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గత 2 రోజులుగా అధికారులు విచారణ చేపట్టారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఘటనపై నిజాన్ని దాచిపెట్టారనే అభియోగంపై ప్రధానోపాధ్యాయుడు షబ్బీర్​ని, తరగతి గదికి వెళ్లకుండా విద్యార్థుల ఘర్షణకు కారకుడైన మరో ఉపాధ్యాయుడు వెంకట్రామిరెడ్డిని బాధ్యుడిని చేస్తూ విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. దీంతో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్టు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు.

విద్యా సంస్థలలో జరిగే ఎలాంటి విషయాలపైన అయినా యాజమాన్యం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడి భార్య రెహమూన్‌ను మంత్రి నారా లోకేశ్‌ ఫోన్‌లో పరామర్శించారు. ఆహ్మద్ మృతిపై లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తన భర్త మరణంపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని రెహమూన్‌ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొందరు ఉపాధ్యాయులు ప్రేరేపించడంతోనే విద్యార్థులు దాడి చేశారనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి లోకేశ్ రెహమూన్​కు భరోసా ఇచ్చారు.

ఇదీ జరిగింది: బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసే సమయంలో 9వ తరగతి గదిలో ఉపాధ్యాయులెవరూ లేకపోవడంతో పిల్లలు అల్లరి చేస్తున్నారు. పక్క గదిలో పాఠాలు బోధిస్తున్న సైన్స్‌ ఉపాధ్యాయుడు అహ్మద్‌ అల్లరి చేస్తున్న విద్యార్థుల గదిలోకి వెళ్లి మందలించారు. ముగ్గురు విద్యార్థులు గొడవ పడుతుండగా అడ్డుకునే క్రమంలో వారిపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ ముగ్గురు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై తిరగబడి చేయి చేసుకున్నారు. ముగ్గురూ కలిసి తోసేయడంతో ఆయన కింద పడిపోయారని, పిల్లలందరి ముందు విద్యార్థులు చేయి చేసుకోవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన అహ్మద్‌ అరగంట పాటు చాలా కుంగిపోయారు. ఆ సమయంలోనే ఊపిరి ఆడక, గుండెనొప్పిగా ఉందంటూ కుప్పకూలిపోయారు.

ఉపాధ్యాయుడిపై విద్యార్థుల దాడి! - ఊపిరాడక మృతి

గుండెపోటు నివారణ ఔషధం - పేటెంట్​ పొందిన బాపట్ల వైద్యులు

ABOUT THE AUTHOR

...view details