ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం - మిగిలిన మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల - Three white papers in assembly

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 3:26 PM IST

Government has Decided to Release Remaining Three White Papers in Assembly :రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనుంది. అయితే రాష్ట్రంలో 'శాంతి భద్రతల' అంశంపై ఈరోజు శ్వేతపత్రం విడుదలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం రద్దు చేసింది.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Government has Decided to Release Remaining Three White Papers in Assembly : రాష్ట్ర ప్రభుత్వం వెలువరిస్తున్న శ్వేతపత్రాల్లో మిగిలిన మూడింటిని అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగింటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇసుక, విద్యుత్‌, పోలవరం-నీటిపారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన విధ్వంసాలను వీటి ద్వారా ప్రజలకు వెల్లడించారు. ఈ రోజు శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి వుండగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడే శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు.

ABOUT THE AUTHOR

...view details