ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మహిళా దొంగలు మాయ చేశారు'- 'ఏటీఎం ధ్వంసం చేసి 29లక్షలు చోరీ' - Theft Cases in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 12:42 PM IST

Theft Cases in AP : ఏపీలో వరుస దొంగతనాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో దొంగలు చోరీలకు పాల్పడారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Theft Cases in AP
Theft Cases in AP (ETV Bharat)

Robbery Cases in Andhra Pradesh :రాష్ట్రంలోదొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు నిత్యం గస్తీ కాస్తున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా రాష్ట్రంలో మూడు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

SBI ATM Theft in Anantapur :అనంతపురం పట్టణంలోని రాంనగర్ మెయిన్​రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో దొంగతనం జరిగింది. మిషన్​ను ధ్వంసం చేసి రూ.29 లక్షలు దోచుకెళ్లారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న మిషన్ డోర్లను గ్యాస్ కట్టర్​తో తొలగించారు. ఆ తర్వాత అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో అలారం సిస్టం పనిచేసిన పోలీసులు అక్కడికి చేరుకునే లోపే వారు నగదుతో ఉడాయించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

'మహిళా దొంగలు మాయ చేశారు'- 'ఏటీఎం ధ్వంసం చేసి 29లక్షలు చోరీ' (ETV Bharat)

Theft Case in Kadapa : కడపలో దొంగతనం చోటుచేసుకుంది. ప్రకాష్​నగర్​లో వరలక్ష్మి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె భర్త కొద్ది రోజుల క్రితం మరణించాడు. ఈ క్రమంలోనే వివిధ కార్యక్రమాల కోసం కుటుంబ సభ్యులు స్వగ్రామమైన చెన్నూరుకు వెళ్లారు. తిరిగి శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన వారు తలుపులు తెరచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తెరచి ఉంది. అందులో దాచిన నాలుగున్నర లక్షల నగదు, 10 తులాల బంగారు నగలు చోరికి గురైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెెంటనే బాధితులు పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నెల్లూరు జిల్లాలో రెచ్చిపోయిన మహిళా దొంగలు (ETV Bharat)

Robbery in Shop at Kovur : నెల్లూరు జిల్లా కోవూరులో మహిళా దొంగలు హల్​చల్ చేశారు. పట్టణంలోని రాయల్ వస్త్ర దుకాణంలోని వస్త్రాలను ఎత్తుకెళ్లారు. కొనుగోలుదారులుగా దాదాపు పది మంది మహిళలు షాప్​కు వచ్చారు. బట్టలు చూపించమని అడిగారు. దాంతో అందులో పనిచేసే ఉద్యోగిని వారికి వస్త్రాలను చూపించే పనిలో ఉన్నారు. అది చూపించండి, ఇది చూపించండంటూ ఆమె దృష్టిని మరల్చి బట్టలను అపహరించారు. చివరకు తమకు బట్టలు నచ్చలేదని అక్కడి నుంచి మహిళా దొంగలు ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో వీరి గుట్టు బయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు గతంలోనూ ఈ మహిళా దొంగల ముఠా కోవూరులో చోరీ చేసినట్లు తెలుస్తోంది.

పట్టపగలే బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు - వృద్ధురాలిపై దాడి, తీవ్రగాయాలు - Thieves Gold Robbery

అవమానం జరిగిందని రగిలిపోయిన దొంగలు- ప్రతీకారంతో మళ్లీ చోరీ - Theft in Temple at Prakasam

ABOUT THE AUTHOR

...view details