ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హోంమంత్రి నివాసాన్ని చుట్టుముట్టిన వరద- 'నా కంటే ముందు సామాన్యులకు సాయం చేయండి' - Anita residence under flood

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 1:05 PM IST

Floods to Anitha House : విజయవాడను వరదల్లో హోంమంత్రి అనిత నివాసం కూడా జలమయమైంది. ఈ క్రమంలోనే విపత్తు బృందం అక్కడికి చేరుకుంది. కానీ, ఆమె తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Floods to Anitha House
Floods to Anitha House (ETV Bharat)

Anitha Visits Flood Affected Areas in Vijayawada : విజయవాడలో భారీ వర్షాలకు హోం మంత్రి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి పంపించారు. రామవరప్పాడు వంతెన కింద ఆమె ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. ఆదివారం నుంచి అనిత నివాసం వరద ముంపులోనే ఉంది. అయినా ఆమె సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

మరోవైపు విపత్తు నిర్వహణ బృందం అనిత ఇంటి వద్దకు చేరుకుంది. కానీ ఆమె తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాలనీలో ఇతర కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తన ఇంటి కోసం వచ్చిన సహాయక బృందాన్ని సింగ్​నగర్ వైపు పంపించారు.

Vijayawada Floods Updates :ఆదివారం ఉదయం బుడమేరు కట్ట తెగిపోవటంతో ఒక్కసారిగా వరద నీరు విజయవాడ నగరాన్ని ముంచెత్తిందని హోంమంత్రి అనిత తెలిపారు. నగరంలోని 8 డివిజన్లతో పాటు గన్నవరం, మైలవరం, విజయవాడ తూర్పు పరిధిలోని కొన్ని ప్రాంతాలు కూడా వరద తాకిడికి గురయ్యాయన్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల పరిధిలో 24 కాలనీలు 70 సచివాలయాలు ఉన్నాయని చెప్పారు. ప్రతీ సచివాలయం పరిధిలో ఒక ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించామని అనిత వెల్లడించారు.

యుద్ధ ప్రాతిపదికన 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అనిత తెలిపారు. మిగిలిన వారిని తరలించేందుకు పడవల సమస్య ఉండటంతో కేంద్ర సాయం కోరామని పేర్కొన్నారు. విజయవాడ నగరం సాధారణ స్థితికి వచ్చి జనజీవనం మామూలుగా సాగేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అంత వరకూ ముఖ్యమంత్రి సహా ఏ ఒక్కరూ కదలకూడదని నిర్ణయించామన్నారు. దాదాపు 2 లక్షల మందికి యుద్ధ ప్రాతిపదికన ఆహారం పంపిణీ చేపట్టామని అనిత వెల్లడించారు.

జలవనరులశాఖ నిద్రపోవడంతోనే ఈ దుస్థితి : విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద నీటిని ఎక్కడికి ఎత్తి పోయాలన్నది ఇప్పుడు ప్రధాన సవాల్ గా మారిందని అనిత చెప్పారు. మంత్రి రామానాయుడు నేతృత్వంలో జలవనరుల శాఖ దీనిపై క్షేత్రస్థాయిలో నిర్విరామంగా పనిచేస్తోందని వెల్లడించారు. గత 5 ఏళ్లు జలవనరుల శాఖ నిద్రపోవడం వల్లే ఇప్పుడు వరద నీరు ఎటు పంపాలో అర్ధంకాని పరిస్థితి తలెత్తిందని అనిత వ్యాఖ్యానించారు.

కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా మొదటి ప్రాధాన్యత : సీఎం చంద్రబాబు - Chandrababu Visit Singh Nagar

ABOUT THE AUTHOR

...view details