ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరిగిన మద్యం ధరలు - కానీ వాటికి మినహాయింపు - LIQUOR PRICES HIKE IN AP

రాష్ట్రంలో మద్యం ధరలు 15 శాతం పెంచుతూ ఎక్సైజ్‌ శాఖ నిర్ణయం - రూ.99కు విక్రయించే బ్రాండ్, బీరు మినహా అన్ని కేటగిరీల్లో పెంపు

Liquor Rates Increase in AP
Liquor Rates Increase in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2025, 9:33 PM IST

Updated : Feb 10, 2025, 10:41 PM IST

Liquor Prices Hike in AP : ఏపీలో మందుబాబులకు భారీ షాక్‌ తగిలింది. మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ధరలను 15శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ.99కు అమ్మే బ్రాండ్ మరియు బీరు మినహా అన్ని కేటగిరీల్లో ఈ ధరల పెంపును అమలు చేయనుంది. అలాగే దేశీయ తయారీ విదేశీ మద్యం, విదేశీ మద్యంపై అదనపు ఏఈఆర్‌టీ వసూలు చేయనుంది. ఇదివరకే రిటైల్ విక్రయాలపై మార్జిన్​ను 14.5 శాతం నుంచి 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.

అసత్య ప్రచారం జరుగుతోంది : మద్యం ధరల పెరుగుదలపై ఎక్సైజ్‌శాఖ కమిషనర్ నిశాంత్‌కుమార్‌ వివరణ ఇచ్చారు. మద్యం ధరల్లో మార్పుపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ధర రూ.15, రూ.20 పెరిగినట్లు అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. పెరిగిన ధర 10 రూపాయలేనని స్పష్టం చేశారు. బ్రాండ్, సైజ్‌తో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 మాత్రమే పెంచామన్నారు. రూ.99 మద్యం బాటిల్‌, బీరు ధరలో ఎలాంటి మార్పు లేదన్నారు. ధరలను మద్యం షాపుల వద్ద ప్రదర్శించాలని సంబంధిత అధికారును ఆదేశించినట్టు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ వెల్లడించారు.

Last Updated : Feb 10, 2025, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details