Errors in Teacher Adjustment Process in YSR District : ఉపాధ్యాయుల బదిలీ విషయంలో లోపాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటులో సబ్జెక్టుల వారీగా అవసరమున్న పాఠశాలలకు పలువురిని నియమించింది. ఈ క్రమంలోనే సాధారణ ఉపాధ్యాయులను ఉర్దూ పాఠశాలకు పంపిస్తున్నారు. దీంతో పిల్లలకు తెలుగు, ఉపాధ్యాయులకు ఉర్దూ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ ప్రక్రియంతా అస్తవ్యస్తంగా తయారు అయ్యిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నారు. కావాల్సిన చోట నియమించకుండా ఇష్టారాజ్యంగా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భాషతో సంబంధం లేకుండా :వైఎస్సార్ జిల్లా కడప నగరపాలక సంస్థ ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉర్దూ మాధ్యమం అమలు అవుతోంది. ఆ పాఠశాలకు గణితం ఉపాధ్యాయుల అవసరం ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుడి కేటాయించాలి. ఇటీవల జిల్లా విద్యాశాఖ (District Education Department చేపట్టిన సర్దుబాటు ప్రక్రియలో ఉర్దూ భాషతో ఏ మాత్రం సంబంధం లేని సాధారణ ఉపాధ్యాయులను ఆ పాఠశాలకు పంపారు. దీంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. కనీసం ఇంగ్లిఘ మీడియం పాఠశాలలైనా ఉర్దూ మినహా మిగిలిన సబ్జెక్టులకు కొంత ఉపశమనం దక్కేది. ఇక్కడ అలాంటి పరిస్థితి కూడా లేకుండాపోయిందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాకు ఉర్దూ రాదు. ఆ విద్యార్థులకు తెలుగు రాదు. నేను ఇంగ్లీఘలో గణితం చెబుతున్నాను. విద్యార్థులు నన్ను ఉర్దూలో ప్రశ్నలు అడుగుతున్నాను. నాకేమీ అర్థం కావడం లేదు. దయచేసి నన్ను ఈ పాఠశాల నుంచి మార్చండి - ఓ ఉపాధ్యాయుడు, వైఎస్సార్ జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - 27 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ
విద్యా వాలంటీర్లను నియమించినా సరిపోయేది : ఇటీవల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు ఉర్దూ రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఉర్దూ మినహా ఇతర మాధ్యమాలు అవసరం లేకుండాపోవడంతో విద్యాశాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీని కన్నా విద్యా వాలంటీర్లను ఉర్దూ పాఠశాలకు కేటాయించినా, తాత్కాలికంగా సమస్యల పరిష్కారమయ్యేదని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. వైఎస్ఆర్, అన్నమయ్యతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.