తెలంగాణ

telangana

ETV Bharat / state

తుపాన్ అలర్ట్ : ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు! - ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ - FLASH FLOODING IN VIZAG

తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం - వెల్లడించిన భారత వాతావరణ శాఖ - ఏపీలోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఛాన్స్

FLASH FLOODING IN VIZAG
తుపాను నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 12:13 PM IST

Cyclone in Vishakapatnam : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం (నవంబర్​ 29) మధ్యాహ్నం తుపానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ఫెయింజల్‌గా నామకరణం చేశారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శనివారం (నవంబర్ 30) మధ్యాహ్నానికి కారైకాల్‌ (పుదుచ్చేరి), మహాబలిపురం (తమిళనాడు) మధ్యలో తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు.

పోర్టులకు హెచ్చరికలు :ఆంధ్రప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం ఇన్‌ఛార్జీ డైరెక్టర్‌ కేవీఎస్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌, తిరుపతి జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం (డిసెంబర్ 02) వరకు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.

కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, పోర్టులకు రెండో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. కడలూరు, తంజావూరు, నాగపట్టణం, మయిలాడుదురై, తిరువారూరు, విళుపురం జిల్లాలకు విపత్తు నిర్వహణ దళాల (డిజాస్టర్​ మెనేజ్​మెంట్​ ఫోర్స్)ను పంపించారు. ప్రభావిత జిల్లాల్లో 2 వేల 229 సహాయక కేంద్రాల్ని సిద్ధం చేశారు.

దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం - మరో 6 గంటల్లో తుపాను!

ముంచుకొస్తున్న మరో తుపాను - ఏపీ పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

ABOUT THE AUTHOR

...view details