తెలంగాణ

telangana

ETV Bharat / state

యువనాయకురాలు లాస్య నందిత మృతిపై ప్రముఖుల సంతాపం - contonment brs mla lasya dead

Political Leaders Pays Tribute to Lasya Nandita death : కంటోన్మెంట్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నందిత మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. నందిత అకాల మరణం తీవ్ర విషాదం నింపిందన్న ప్రజాప్రతినిధులు, ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని కోరారు.

Contonment BRS MLA Lasya Nandita Dead
Political Leaders Pays Tribute to Lasya Nandita's death

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 7:58 PM IST

Updated : Feb 23, 2024, 9:31 PM IST

యువనాయకురాలు లాస్య నందిత మృతిపై- పలువురు ప్రముఖుల సంతాపం

Political Leaders Pays Tribute to Lasya Nandita's death :లాస్య నందితను రోడ్డు ప్రమాదం కబళించడంపై పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. యువ రాజకీయ నాయకురాలు లాస్య నందిత మృతిపై(Lasya Nandita Dead) గవర్నర్‌ తమిళిసై సంతాపం తెలిపారు. లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth) నివాళి అర్పించారు. సికింద్రాబాద్‌ కార్ఖానాలోని లాస్య నివాసానికి వెళ్లిన సీఎం, ఆమె కుటుంబసభ్యులను ఓదార్చారు. నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న రేవంత్‌, ఆమె తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.

లాస్య నందిత మృతి పట్ల సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అమాత్యులు శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లు విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Contonment BRS MLALasya Nandita Dead :లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలియజేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR), ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. చిన్న వయసులో లాస్య అకాల మరణం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. లాస్య మృతి పట్ల మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాసేవకు అంకితమైన యువ ఎమ్మెల్యే మృతి అత్యంత బాధాకరమన్న ఎమ్మెల్సీ కవిత, నందిత కుటుంబసభ్యులను ఓదార్చారు.

కబళించిన మృత్యువు - లాస్య నందితకు కలిసి రాని 'ఎమ్మెల్యే' కాలం

లాస్య నందిత మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సహా పలువురు బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య నందిత అకాల మరణం తీవ్ర విచారకరమన్న కిషన్‌రెడ్డి, నందిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎదుట ఉజ్వల భవిష్యత్తు ఉండగా, విధి మరొకటి తలచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"యువనాయకురాలు లాస్య నందిత అకాల మరణం బాధాకరం. వాళ్ల నాన్న గారు సాయన్నతో మంచి అనుబంధముంది. సరిగ్గా వాళ్ల నాన్న చనిపోయి సంవత్సరం తిరగకముందే వాళ్ల కూతురు లాస్యనందిత మృతి చెందడం విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి". - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి

కారు ప్రమాదంలో కంటోన్మెంట్​ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి - దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు - ఏర్పాట్లకు హైదరాబాద్‌ కలెక్టర్‌కు ఆదేశాలు

Last Updated : Feb 23, 2024, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details