ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రానికి భారీ పెట్టుబడులే టార్గెట్ - దావోస్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు - CM CHANDRABABU DAVOS TOUR

దావోస్ పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు - దిల్లీ మీదుగా జ్యూరిచ్‌ వెళ్లనున్న ముఖ్యమంత్రి

CM Chandrababu  Davos Tour
CM Chandrababu Davos Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 19, 2025, 10:38 PM IST

CM Chandrababu Davos Tour 2025 :ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి దిల్లీ మీదుగా దావోస్ పర్యటనకు బయల్దేరారు. సీఎం రాత్రి 11 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి అర్ధరాత్రి 1.45 గంటలకు జ్యూరిచ్‌ వెళ్లనున్నారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన దావోస్ పర్యటన జరగనుంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్​తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధనకు ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్​తో పాటు అధికారులు ఉన్నారు.

సోమవారం నాడు జ్యూరిచ్‌లో ఉన్న భారత రాయబారితో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది. హిల్టన్ హోటల్​లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. హోటల్ హయత్​లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించనున్న భేటీలో తెలుగు పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చించనున్నారు.

అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకోనున్న సీఎం బృందం తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్​లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్​తో సమావేశం కానున్నారు. రెండో రోజు సీఐఐ సెషన్​లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చిస్తారు. అదేవిధంగా సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్​స్పన్, ఎల్​జీ, కార్ల్స్​బర్గ్, సిస్కో, వాల్​మార్ట్ ఇంటర్నేషనల్​, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్​లతో చంద్రబాబు భేటీ అవుతారు.

Chandrababu Promote Brand AP : యుఏఈ ఎకానిమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్​తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారు. ది నెక్ట్స్ వేవ్ పైనిరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమోరో చర్చా కార్యక్రమం సహా వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మూడో రోజు పలు బిజనెస్ టైకూన్​లతో సీఎం సమావేశమవుతారు. రోజుకు కనీసం పదికిపైగా భేటీలు, సమావేశాలకు హాజరు కానున్నారు. నాలుగో రోజు చంద్రబాబు బృందం దావోస్ నుంచి జ్యూరిచ్‌ చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు.

ప్రపంచ పెట్టుబడుల మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ చేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 55వ ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొనే రాష్ట్ర ప్రభుత్వ బృందానికి నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. దావోస్‌లో కలుద్దాం అంటూ ఎక్స్ వేదికగా చంద్రబాబు పోస్ట్ చేశారు.

7 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులు - ఇకపై అన్నీ మంచి రోజులే: చంద్రబాబు

సంపద సృష్టిస్తాం - ప్రజల ఆదాయం పెంచుతాం: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details