ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తాం - ఇకనుంచి ఆకస్మిక తనిఖీలు: చంద్రబాబు - CHANDRABABU VISIT GANGURU VILLAGE

గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన సీఎం - మద్దతు ధరపై రైతులతో ముఖాముఖి

chandrababu_visit_ganguru_village
chandrababu_visit_ganguru_village (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2024, 3:44 PM IST

Updated : Dec 20, 2024, 8:09 PM IST

CM Chandrababu Inspected Grain Purchase Centers:ధాన్యం సేకరణ మొదలు రైతులకు నగదు చెల్లించే వరకూ ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు అధికారులకు తేల్చిచెప్పారు. తేమ శాతంలో ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడి, ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గంగూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో సీఎం పర్యటన కొనసాగింది. గంగూరు రైతు సేవాకేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించి ధాన్యం సేకరణ మొదలు మిల్లులకు ఎగుమతి చేసే ప్రక్రియ మొత్తాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది, రైతులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

తప్పు జరిగితే కఠిన చర్యలు: పండించిన పంటకు మద్ధతు ధర లభిస్తుందా లేదా అని రైతులను సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఐవీఆర్‌ఎఫ్‌ ద్వారా రైతుల నుంచి తానే స్వయంగా అభిప్రాయాలు సేకరిస్తానని తెలిపారు. అధికారుల నుంచి తనకు కావాల్సింది డాక్యుమెంటేషన్‌ కాదని రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్‌మెంట్‌ కనిపించాలని తేల్చిచెప్పారు.

తేమ శాతం నమోదు, ఇతరత్రా అంశాల్లో ఎగుమతి, దిగుమతి దగ్గర ఒకేలా కచ్చితత్వం ఉండాలన్న ఇందులో ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తూకంలో హెచ్చుతగ్గులు, తేమశాతంలో లొసుగులు వంటి అంశాలను సీఎం స్వయంగా తెలుసుకున్నారు. తేమశాతం నిర్ధారణ చేసే మిషన్‌ పనితనాన్ని స్వయంగా పరిశీలించారు. ఐవీఆర్‌ఎఫ్‌ ద్వారా ఎప్పటికప్పుడు తనకు ఫీడ్‌ బ్యాక్‌ పంపాలని సీఎం సూచించారు.

సడన్ విజిట్స్ పెంచుతా:ధాన్యం దిగుబడిలో మెకనైజేషన్ పెంచి రైతుల ఆదాయం పెంచే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. దిగుబడి పెరిగి డబ్బు సకాలంలో చేతికొస్తుండటంతో రైతులు గత ఏడాది కంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతం ఒకలా ఉంటే మిల్లర్ల వద్ద మెషీన్లలో మరోలా ఉంటోందన్నారు.

ధాన్యం సేకరణ కేంద్రాలను ఇకనుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సాంకేతికత సక్రమ వినియోగంతో రైతుల ఖర్చు తగ్గించి ఎక్కువ లాభం వచ్చేలా చేస్తామని చెప్పారు. లాభసాటి వ్యవసాయంపై రైతుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చర్చలు చేపడతామని వెల్లడించారు. దళారీ ముసుగులో రైతులకు ఎవరు అన్యాయం చేయాలని చూసినా ఉపేక్షించనని హెచ్చరించారు.

గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం: పవన్ కల్యాణ్

బియ్యం అక్రమ రవాణాను అరికడతాము:రాష్ట్రంలో స్మగ్లింగ్​కి చోటు లేదని సీఎం తేల్చిచెప్పారు. స్మగ్లర్ల్ అనే మాట లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని బియ్యం అక్రమ రవాణాను అరికట్టి తీరుతామని స్పష్టం చేశారు. బియ్యం స్మగ్లింగ్, రీసైక్లింగ్ విషయంలో కఠినంగా ఉంటామని అన్నారు. కాలువలు ఆక్రమణలకు గురవ్వడం వల్ల నీరు సరిగా రావడం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వాటిని తీసేయాలని చంద్రబాబు ఆదేశించారు. పంట దిగుబడి సరిగా రాని రైతుకు బెస్ట్ ప్రాక్టీసెస్ ఆచరించి పంట దిగుబడి పెంచేలా అధికారులు గైడ్ చేయాలని చెప్పారు. ఏ పంటకు ఎంత డిమాండ్​ ఉంది, మార్కెటింగ్ ఎలాగ అనేది కూడా రైతులకు అధికారులు చెప్పాలని సీఎం సూచించారు.

సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తా:గంగూరులో పర్యటన అనంతరం ఈడుపుగల్లు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణ చేస్తామని తెలిపారు. ఎవరైనా సెంటు భూమి కబ్జా చేసినా తాట తీస్తామని హెచ్చరించారు. కబ్జా చేసేందుకు భూమి దగ్గరకు వెళ్లినప్పుడే జైలు కూడా కనిపించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్​ను పకడ్బందీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా తప్పు చేసిన వారిపై పీడీయాక్ట్ పెట్టి కేసులు నమోదు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో నవ్వాలంటేనే భయపడిపోయే ప్రజల ముఖాల్లో సంతోషం చూస్తున్నానన్నారు.

జవాబుదారీ తనంగా పని చేస్తా:సర్వే రాళ్లపై జగన్ బొమ్మ తొలగించేందుకే 12 కోట్లు ఖర్చయిందని వెల్లడించారు. ఏళ్ల తరబడి పరీష్కారం కాని సమస్యలకు రెవెన్యూ సదస్సులో పరీష్కారం చూపుతామని చెప్పారు. తన దగ్గరకు ఒక్క అర్జీ కూడా రానప్పుడే శాఖ సమర్థంగా పని చేసినట్లు అని స్పష్టం చేశారు. ప్రతీ ఫిర్యాదు నమోదు చేసి, జవాబుదారీ తనంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. రికార్డులన్నీ సరిచేశాక కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈడుపుగల్లు బీసీ కాలనీ వాసులు 173 మందికి ఇంటి జాగా ఇస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 22ఏలో పెట్టిన భూమిని తిరిగి అసలు లబ్ధిదారులకు అందచేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

'నువ్వే పెద్ద డైమండ్‌, నీకెందుకు డైమండ్‌ అనేశారు చంద్రబాబు'

రూ.33 వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలకు పచ్చజెండా

Last Updated : Dec 20, 2024, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details