తెలంగాణ

telangana

ETV Bharat / state

మియాపూర్​ వాసులకు రెడ్ అలర్ట్! మెట్రో స్టేషన్ వెనక చిరుత కలకలం

మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ వెనకాల చిరుత కలకలం - పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు - అటవీ అధికారుల సహయంతో గాలిస్తామని వెల్లడించిన పోలీసులు.

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Cheetah In Hyderabad
Cheetah At Miyapur Metro Station (ETV Bharat)

Cheetah At Miyapur Metro Station In Hyderabad :మీరు మియాపూర్​లో ఉంటున్నారా అయితే మీ కోసమే ఈ న్యూస్. మీరు ఉంటున్న ఏరియాలో చిరుతపులి కనిపించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనక వద్ద ఇవాళ కొందరు చిరుతపులిని చూశారు. స్టేషన్ వెనక జరుగుతున్న నిర్మాణాల కోసం వచ్చిన కూలీలు చిరుతను చూశారని సమాచారం.

చిరుత నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను వీడియో తీసి సమాచారాన్ని పోలీసులకు అందించారు. వారు వెంటనే అటవీశాఖ అధికారులను సంప్రదించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు చిరుతపులిని గాలించే పనిలో ఉన్నారు. మరోవైపు మియాపూర్ మెట్రో వెనక ఉన్న చంద్రనాయక్ తండావాసులతో పాటు చుట్టూ పక్కల కాలనీ వాసులను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని, బయట తిరగొద్దని పోలీసులు హెచ్చరించారు.

సాధారణంగా వికారాబాద్ సమీపంలో, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వెనక వైపు గతంలో చిరుతలు సంచరించాయి. అప్పుడు అటవీ అధికారులు వాటిని బంధించి నల్లమల అడవుల్లో వదిలిపెట్టారు. ఇప్పుడు కొత్తగా మియాపూర్ వంటి జనావాసం ఉన్న ప్రాంతంలో కనిపించిందన్న సమాచారం స్థానికంగా కలకలం పుట్టిస్తోంది. వీలైనంత త్వరగా చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details