Bomb Threat to Telangana Secretriat : రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపు ఓ ఫోన్ కాల్ కలకలం రేపింది. సెక్రటేరియెట్ను బాంబు పెట్టి పేల్చేస్తామని ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. 3 రోజులుగా ఫోన్ కాల్ రావడంతో సచివాలయాన్ని తనిఖీ చేశారు. అది ఫేక్ కాల్ అని తేలడంతో ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు.
వివరాల్లోకి వెళ్తే : హైదరాబాద్ లంగర్ హౌజ్కు ప్రాంతానికి చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ గత మూడు రోజుల నుంచి సచివాయలాన్ని బాంబు పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నానని, అధికారులు స్పందించక పోవడంతో బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. సయ్యద్ మీర్ మహ్మద్పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.