ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏపీ ఎన్నికల్లో ప్రముఖుల నియోజకవర్గల్లో పోలింగ్​ శాతం ఎంతంటే!? - polling in Celebrity Constituencies

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 5:07 PM IST

Updated : May 15, 2024, 10:43 PM IST

AP Vote Percentage in 6 Celebrity Constituencies : రాష్ట్ర వ్యాప్తంగా ఓటు వెయ్యడంలో ప్రజలు ఉత్సాహం కనబరిచారు. దీంతో ఓటింగ్ శాతం బాగా ఆకట్టుకుంటున్నప్పటికీ, రాష్ట్రంలోని రాజకీయ ప్రముఖులు వారి వారి నియోజకవర్గాల్లో పోల్ అయిన ఓట్ల శాతం ఎంతో తెలుసా?

ap_vote_percentage_in_6_celebrity_constituencies
ap_vote_percentage_in_6_celebrity_constituencies (ETV Bharat)

AP Vote Percentage in 6 Celebrity Constituencies : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించారు. రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్‌ నమోదైందని స్పష్టం చేశారు.

  • చంద్రబాబునాయుడు - కుప్పం - 85.87%
  • జగన్ - పులివెందుల - 81.34%
  • పవన్ కళ్యాణ్ - పిఠాపురం - 86.63%
  • నారా లోకేష్ - మంగళగిరి - 85.74%
  • నందమూరి బాలకృష్ణ - హిందూపూర్ - 77.82%
  • షర్మిల - కడప (పా) - 78.73%

ఎన్నికల్లో క్లీన్​ స్వీప్​ చేస్తామని కూటమి అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అధికారం చేజిక్కుతుందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం

జిల్లా పోలింగ్‌శాతం
పల్నాడు 85.65
బాపట్ల 85.15
కృష్ణా 84.05
శ్రీసత్యసాయి 84.63
అనకాపల్లి, కోనసీమ 83.84
నంద్యాల 82.09
ఏలూరు 83.67
ప.గో. జిల్లా 82.59
విజయనగరం 81.33
అనంతపురం 81.08
తూ.గో. జిల్లా 80.93
కాకినాడ 80.31
నెల్లూరు 79.63
వైఎస్సార్‌ 79.58
ఎన్టీఆర్ 79.36
గుంటూరు 78.81
తిరుపతి 78.63
అన్నమయ్య 77.83
పార్వతీపురం మన్యం 77.10
కర్నూలు 76.42
శ్రీకాకుళం 75.59
అల్లూరి 70.20

నియోజకవర్గాల వారీగా అత్యధికంగా దర్శి నియోజవర్గంలో 90.91 శాతం పోలింగ్‌ కాగా అత్యల్పంగా తిరుపతి నియోజకవర్గంలో 63.32 శాతం నమోదయ్యింది.

రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ - ఎన్డీయేకు 130-140 అసెంబ్లీ సీట్లు? - OPINION ON ANDHRA ELECTIONS

ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్‌ బ్యాలెట్‌తో 1.2 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్‌ కొనసాగింది. ఆఖరి పోలింగ్‌ కేంద్రంలో రాత్రి 2 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు.

గత ఎన్నికలతో పోలిస్తే 2.09 శాతం పోలింగ్‌ పెరిగిందని మీనా తెలిపారు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం నమోదైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు. లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్‌సభలో 71.11 శాతం పోలింగ్‌ నమోదైనట్లు సీఈవో చెప్పారు.

రాష్ట్రంలో అల్లర్లపై ఈసీ సీరియస్​- సీఎస్‌, డీజీపీకి సమన్లు జారీ - EC Issued Summons to AP CS and DGP

Last Updated : May 15, 2024, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details