ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2018 గ్రూప్‌-1 మెయిన్స్​ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు - 2018 Group 1 Exam Cancellation

AP High Court Verdict on 2018 Group-1 Mains: 2018లో జరిగిన గ్రూప్‌-1 పరీక్షపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆ మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మళ్లీ పరీక్ష నిర్వహించి 6 వారాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది.

high_court_on_group_1
high_court_on_group_1

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 12:20 PM IST

Updated : Mar 13, 2024, 2:50 PM IST

AP High Court Verdict on 2018 Group-1 Mains:2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండో సారి, మూడో సారి మూల్యాంకనం చేయటం చట్ట విరుద్దమని హైకోర్టు తీర్పు నిచ్చింది. మెయిన్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. మెయిన్స్ పరీక్షను తాజాగా నిర్వహించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2018 నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మొదట డిజిటల్​గా మూల్యాంకనం చేశారు. దీనిపై పలువురు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు.

వైసీపీఎస్సీగా ఏపీపీఎస్సీ - అయినవారికే పదవులు

హైకోర్టు ఆదేశాల ప్రకారం పేపర్లను మాన్యువల్​గా(చేతితో దిద్దడం) మూల్యాంకనం చేశారు. ఈ క్రమంలో గతంలో అర్హత పొందిన కొందరు అభ్యర్ధులు అనర్హులుగా మారారు. దీంతో అర్హత కోల్పోయిన అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం మెయిన్స్ అభ్యర్ధుల జాబితాను రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తాజాగా మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. నోటిఫికేషన్ ఆధారంగా అర్హత సాధించిన వారందరికీ ప్రభుత్వం ఇప్పటికే పోస్టింగ్​లు సైతం ఇచ్చింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇవ్వటంతో చర్చనీయాంశంగా మారింది.

ఆందోళన వద్దు : 2018 గ్రూప్-1 అంశంలో హైకోర్టు తీర్పుపై ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలు కాపాడతామని ప్రకటించింది. ఉద్యోగుల తరఫున న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రభుత్వం తెలిపింది.

నిరుద్యోగులంటే వైసీపీ ప్రభుత్వానికి అంత అలుసా? - తీవ్ర నిరాశలో యువత

వైసీపీ నాయకులతో ఏపీపీఎస్సీ బోర్డు:గ్రూప్​-1 నోటిఫికేషన్ పూర్తిగా అక్రమాలతో ఉందని నిరుద్యోగ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ షేక్ సిద్దిక్ అన్నారు. 2021 ఫిబ్రవరిలో ఇవ్వాల్సిన ఫలితాలను 2021 జూన్​లో ఇచ్చారన్నారు. 49 వేల ఓఎంఆర్ షీట్లను ఏపీపీఎస్సీ పూర్తిగా మార్చేసి వారికి కావాల్సిన వారికి పోస్టులను ఇచ్చిందని ఆరోపించారు. హైకోర్టు తీర్పులోనే పూర్తిగా స్పష్టత ఉందని అన్నారు. వైసీపీ నాయకులతో ఏపీపీఎస్సీ బోర్డును పూర్తిగా నింపేశారని విమర్శించారు. ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దీనిపై సీబీఐ విచారణ జరిపి ఇందులో ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాలంటారు ఉసూరుమనిపిస్తారు! జాబ్‌ క్యాలెండర్‌ను పట్టించుకోని ప్రభుత్వం

Last Updated : Mar 13, 2024, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details