తెలంగాణ

telangana

సీఎం చంద్రబాబు పెద్దమనసు - ఇచ్చిన మాటపై నిలబడి - ఓ పేదదంపతుల కుటుంబానికి ఇళ్లు! - Chandrababu Kept His Promise

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 2:28 PM IST

AP CM Chandrababu Kept His Promise To Poor Couple : ఓ పేద దంపతులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. ఈ నెల 1న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ సందర్భంగా సొంతిల్లు కావాలని కోరిన పేద కుటుంబానికి చంద్రబాబు హామీ ఇచ్చారు. 12 రోజుల్లోనే అందుకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం అధికారులు ఆ దంపతులతో ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయించారు.

CM Chandrababu Kept His Promise To Poor Couple
CM Chandrababu Kept His Promise To Poor Couple (ETV Bharat)

AP CM Chandrababu Kept His Promise To Poor Couple :గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇల్లు నిర్మిస్తానన్న మాటను కేవలం 12 రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. ఈ నెల 1వ తేదీన పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు గ్రామానికి చెందిన నిరుపేద పాములు నాయక్‌ ఇంటికి వెళ్లి పింఛను అందజేశారు. ఈ సందర్భంగా పాములు నాయక్‌ తనకు సొంతిల్లు కట్టుకునే స్తోమత లేక పూరి గుడిసెలో ఉంటున్నానని, తమకు ఇల్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. 15 రోజుల్లో ఇంటి పనులు ప్రారంభిస్తామని ఆయనకు సీఎం హామీ ఇచ్చారు.

పేద దంపతుల పరిస్థితికి చలించిపోయి :నిరుపేద వ్యక్తి అడిగిన సహయానికి స్పందించిన చంద్రబాబు వెంటనే ఇల్లు మంజూరు చేసి పత్రాలు అందజేశారు. దీంతో అధికారులు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇంటి నిర్మాణానికి శుక్రవారం పాములు నాయక్‌ దంపతులతో భూమి పూజ చేయించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి లోకేశ్‌ చొరవతో టీడీపీ నేతలు పనులు ప్రారంభించారు. టీడీపీ మండల కార్యదర్శి కొల్లి శేషు ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. తమకు సీఎం ఇచ్చిన మాట ప్రకారం పక్కా ఇంటి నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో ఆ పేద దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

బాలుడి చదువుకు సీఎం చంద్రబాబు హామీ :అదే విధంగా శుక్రవారం చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్తుండగా తన ఇంటి వద్ద సమస్యలతో వచ్చిన ప్రజల్ని చూసి రోడ్డుమీద కాన్వాయ్ ఆపి అందరినీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. చంద్రబాబు మరోసారి ప్రజల పట్ల సహృదయత చాటుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య ఇచ్చావతితోపాటు కుమారుడిని ఆప్యాయంగా పలకరించారు. కుమారుడు చదువు విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాలుడి చదువు బాధ్యత తాము తీసుకుంటామని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరికొందరు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వగా పరిష్కరిస్తామని సీఎం చెప్పారు.

నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతికి ఫుల్‌స్టాప్‌ పెట్టండి : చంద్రబాబు

నో స్పీడ్ బ్రేకర్లు - మంచి చేసే వారందరికీ కేరాఫ్‌ అడ్రస్‌గా ఏపీ : చంద్రబాబు -

ABOUT THE AUTHOR

...view details