AP Election Result in East Godavari :ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ఆరు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించగా మిగతా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.
అనపర్తి :అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి విజయం సాధించారు.
పిఠాపురం :పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
రాజమండ్రి సిటీ :రాజమండ్రి నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
రాజమండ్రి రూరల్ :రాజమండ్రి గ్రామీణంలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్యచౌదరి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 64,090 ఓట్ల ఆధిక్యంతో విజయం గెలుపు సాధించారు.