ETV Bharat / offbeat

శివరాత్రికి ఎవరైనా ఉపవాసం ఉండొచ్చా? - ఫాస్టింగ్​తో కలిగే ప్రయోజనాలు తెలుసా? - FASTING BENEFITS

మహా శివరాత్రికి భక్తులు జాగారం, ఉపవాసం - నిపుణులు ఏమంటున్నారంటే!

fasting_on_maha_shivaratri
fasting_on_maha_shivaratri (GettyImages)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2025, 12:41 PM IST

Fasting on Maha Shivaratri : ఉపవాసం చేయడం వల్ల పలు ఉపయోగాలు ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో మహాశివరాత్రి వేళ "ఎవరైనా సరే ఫాస్టింగ్ ఉండొచ్చా!" అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపవాసం ఉండడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో గ్లూకోజ్ నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని Cell Metabolism జర్నల్​ వెల్లడించింది. "Early Time-Restricted Feeding Improves Insulin Sensitivity, Blood Pressure, and Oxidative Stress Without Weight Loss in Humans." అనే అంశంపై జరిగిన అధ్యయనంలో University of Alabama at Birmingham పరిశోధకులు Erin F. Sutton పాల్గొన్నారు.

ఉపవాసం వల్ల అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

షుగర్​పై పరిశోధనల్లో కీలక మలుపు - ఆ ప్రొటీన్ పెంచుకుంటే మధుమేహం అదుపులోనే!

రోజులో ఒక పూట లేదా వారంలో అప్పుడప్పుడు క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని మనం ఉపవాసం అంటే వైద్యపరిభాషలో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటారు. ఇలా ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో మంచి మార్పులు జరుగుతున్నాయని, జబ్బులకు కారణమయ్యే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (Intermittent fasting) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మధుమేహం(Diabetes)తో బాధపడేవారు ఉపవాసం చేయొచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ సందేహాలకు సమాధానం తెలుసుకుందాం.

fasting_on_maha_shivaratri
fasting_on_maha_shivaratri (GettyImages)

షుగర్ బాధితులు సక్రమంగానే తింటున్నా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదని వైద్యులు చెబుతున్నారు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌ అని పిలుస్తుంటారు. ఈ సమయంలో వీరి శరీరం పిండిపదార్థాలు తీసుకుంటున్నా సరే కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుందన్నారు. ఫలితంగా 3 గంటలకు మించి ఆహారం తీసుకోకుండా ఉంటే ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌ అనేది పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక ఆరు గంటలకు మించి ఎలాంటి ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడుతుందయ. ఫలింతగా శరీరంలో ఎసిటాల్డిహైడ్‌, ఎసిటోన్‌, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్‌ అనే ఆమ్ల పదార్థాల స్థాయి పెరిగి కీటోన్‌ బోడీస్‌ అనే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.

శరీరంలో కీటోన్‌ బోడీస్‌ పరిస్థితి నెలకొంటే గుండె, ఊపిరితిత్తుల పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అవయవాల పనితీరు దెబ్బతిని క్రమేపీ అవి విఫలమైపోతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డయాబెటిస్ బాధితులకు ఏదైనా శస్త్రచికిత్స అవసరమై గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా గ్లూకోజు ఎక్కిస్తూనే ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తారని వివరించారు.

అందుకే మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. మహాశివరాత్రే కాదు ఎప్పుడైనా సరై గంటల తరబడి ఉపవాసం ఉండడం సరికాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం ప్రక్రియ మంచే చేస్తుంది. దీనివల్ల వారు త్వరగా వ్యాధి బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లోనూ తేలింది. కాబట్టి షుగర్ లేనివారు, ప్రీ డయాబెటిక్ స్టేజ్​లో​ ఉన్నవారు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం ఉండడం మంచిదే అని నిపుణులు చెప్తున్నారు.

NOTE : ఉపవాసం, మధుమేహంపై ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

శివరాత్రి ఎందుకంత స్పెషల్? - ఆ రోజు విశేషం ఏంటో ఆలోచించారా!

ఈ ఆకు రోజుకొక్కటి చాలు - ఎన్నో సమస్యలకు చెక్ పెట్టినట్లే!

Fasting on Maha Shivaratri : ఉపవాసం చేయడం వల్ల పలు ఉపయోగాలు ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో మహాశివరాత్రి వేళ "ఎవరైనా సరే ఫాస్టింగ్ ఉండొచ్చా!" అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉపవాసం ఉండడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో గ్లూకోజ్ నిరోధకత తగ్గి, మధుమేహం బారినపడే అవకాశాలు తగ్గుతున్నాయని Cell Metabolism జర్నల్​ వెల్లడించింది. "Early Time-Restricted Feeding Improves Insulin Sensitivity, Blood Pressure, and Oxidative Stress Without Weight Loss in Humans." అనే అంశంపై జరిగిన అధ్యయనంలో University of Alabama at Birmingham పరిశోధకులు Erin F. Sutton పాల్గొన్నారు.

ఉపవాసం వల్ల అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా తగ్గుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

షుగర్​పై పరిశోధనల్లో కీలక మలుపు - ఆ ప్రొటీన్ పెంచుకుంటే మధుమేహం అదుపులోనే!

రోజులో ఒక పూట లేదా వారంలో అప్పుడప్పుడు క్రమం ప్రకారం కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండటాన్ని మనం ఉపవాసం అంటే వైద్యపరిభాషలో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటారు. ఇలా ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో మంచి మార్పులు జరుగుతున్నాయని, జబ్బులకు కారణమయ్యే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. అప్పుడప్పుడు చేసే ఉపవాసాల (Intermittent fasting) వల్ల శరీరంలో ఎన్నో గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మధుమేహం(Diabetes)తో బాధపడేవారు ఉపవాసం చేయొచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ సందేహాలకు సమాధానం తెలుసుకుందాం.

fasting_on_maha_shivaratri
fasting_on_maha_shivaratri (GettyImages)

షుగర్ బాధితులు సక్రమంగానే తింటున్నా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదని వైద్యులు చెబుతున్నారు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌ అని పిలుస్తుంటారు. ఈ సమయంలో వీరి శరీరం పిండిపదార్థాలు తీసుకుంటున్నా సరే కొవ్వు పదార్థాల నుంచే శక్తిని సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తుంటుందన్నారు. ఫలితంగా 3 గంటలకు మించి ఆహారం తీసుకోకుండా ఉంటే ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌ అనేది పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక ఆరు గంటలకు మించి ఎలాంటి ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడుతుందయ. ఫలింతగా శరీరంలో ఎసిటాల్డిహైడ్‌, ఎసిటోన్‌, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్‌ అనే ఆమ్ల పదార్థాల స్థాయి పెరిగి కీటోన్‌ బోడీస్‌ అనే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.

శరీరంలో కీటోన్‌ బోడీస్‌ పరిస్థితి నెలకొంటే గుండె, ఊపిరితిత్తుల పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అవయవాల పనితీరు దెబ్బతిని క్రమేపీ అవి విఫలమైపోతుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే డయాబెటిస్ బాధితులకు ఏదైనా శస్త్రచికిత్స అవసరమై గంటలతరబడి ఆహారం ఇవ్వకూడని పరిస్థితి ఎదురైనా గ్లూకోజు ఎక్కిస్తూనే ఇన్సులిన్‌ ఇంజక్షన్లు ఇస్తారని వివరించారు.

అందుకే మధుమేహులు గంటల తరబడి ఆహారానికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందే. మహాశివరాత్రే కాదు ఎప్పుడైనా సరై గంటల తరబడి ఉపవాసం ఉండడం సరికాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మధుమేహానికి ముందస్తు దశలో ఉన్న వారికి మాత్రం ఉపవాసం ప్రక్రియ మంచే చేస్తుంది. దీనివల్ల వారు త్వరగా వ్యాధి బారినపడకుండా ఉంటున్నారని అధ్యయనాల్లోనూ తేలింది. కాబట్టి షుగర్ లేనివారు, ప్రీ డయాబెటిక్ స్టేజ్​లో​ ఉన్నవారు ఒక క్రమపద్ధతిలో ఉపవాసం ఉండడం మంచిదే అని నిపుణులు చెప్తున్నారు.

NOTE : ఉపవాసం, మధుమేహంపై ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

శివరాత్రి ఎందుకంత స్పెషల్? - ఆ రోజు విశేషం ఏంటో ఆలోచించారా!

ఈ ఆకు రోజుకొక్కటి చాలు - ఎన్నో సమస్యలకు చెక్ పెట్టినట్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.