తెలంగాణ

telangana

'రోహిత్ శర్మ చాలా కాస్ట్లీ - అతడిని కొనడం కష్టమే!' - IPL 2025 Rohit Sharma

By ETV Bharat Sports Team

Published : Aug 26, 2024, 3:44 PM IST

Rohit Sharma IPL 2025 : ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ వేరే ఫ్రాంచైజీకి వెళ్లిపోతాడనే కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు రోహిత్‌ పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా వెళ్లనున్నారనే వార్తలు హల్​చల్ చేస్తున్నాయి.

Rohit Sharma Move to PBKS IPL 2025
Rohit Sharma (Getty Images)

Rohit Sharma IPL 2025 :ఐపీఎల్‌ మెగా వేలానికి సంబంధించిన ఊహాగానాలు క్రికెట్‌ అభిమానుల్లో హైప్​ క్రియేట్‌ చేస్తుంటాయి. ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌పై వార్తలు రాగా, తాజాగా టీమ్​ఇండియా సారధి రోహిత్‌ శర్మపై వచ్చిన ఊహాగనాలు కలకలం సృష్టిస్తున్నాయి. గత ఐపీఎల్​ సీజన్​లో రోహిత్ శర్మను ముంబయి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో అతడు ఐపీఎల్ 2025 కంటే ముందే వేరే ఫ్రాంచైజీకి వెళ్లిపోతాడనే కథనాలూ వచ్చాయి. తాజాగా రోహిత్ వచ్చే మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకుంటాడని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనినే పంజాబ్ కింగ్స్‌ డైరెక్టర్ సంజయ్ బంగర్ కూడా స్పందించ వల్ల ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

పంజాబ్‌ కెప్టెన్‌గానేనా?
అయితే ఐపీఎల్‌ మెగా వేలంలో రోహిత్ శర్మ పంజాబ్‌ కెప్టెన్‌గా వెళ్లనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన రోహిత్ శర్మ క్రేజ్ మరింత పెరిగింది. అయితే ముంబయి జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తొలగించి, ఆ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఎమ్​ఎస్​ ధోనీకి సమానంగా రోహిత్ ఉన్నాడు. రోహిత్‌ నాయకత్వంలో ముంబయి జట్టు 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ టైటిళ్లను కైవసం చేసుకుంది. రోహిత్ సారథ్యంలోనే అత్యంత ఆధిపత్య ఫ్రాంచైజీగా ముంబయి తనస్థానాన్ని పదిలం చేసుకుంది. ముంబయి ఇండియన్స్​తో రోహిత్ ప్రయాణం 2011లో ప్రారంభమైంది. 2013 సీజన్‌లో రికీ పాంటింగ్ వైదొలిగినప్పుడు అతను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

'రోహిత్ రికార్డులు సృష్టిస్తాడు'
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రోహిత్ శర్మ తన పేరును నమోదు చేసుకుంటాడనే అనే వార్తలు సోషల్​ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మను పంజాబ్ దక్కించుకుంటుందా అనే ప్రశ్నను ఆ టీమ్ పంజాబ్ కింగ్స్‌ డైరెక్టర్ సంజయ్ బంగర్​ను ఓ పాడ్ కాస్ట్​లో అడిగారు. దీనిపై 'రోహిత్‌ మెగా వేలంలోకి వస్తే రికార్డులు సృష్టిస్తాడు. అత్యధిక ధరను సొంతం చేసుకుంటాడు. అయితే, అతడిని పంజాబ్‌ దక్కించుకుంటుందా? లేదా? అనేది పర్సులో సొమ్మును బట్టే తేలుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అతడిని సొంతం చేసుకోవడం మాకు చాలా కష్టమే' అని బంగర్ బదులిచ్చారు.

ముంబయి వీడనున్న సూర్యకుమార్? - ఈ స్టార్ క్రికెటర్ పైనే ఆ ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్! - Suryakumar Yadav KKR

వచ్చే సీజన్​లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా ధోనీ - పాత రూల్​కు బీసీసీఐ ఓకే! - CSK RETAIN MS DHONI IPL 2025

ABOUT THE AUTHOR

...view details