Rohan Bopanna Retirement :భారత జెర్సీలో ఇదే తన చివరి మ్యాచ్ అంటూ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న తాజాగా వ్యాఖ్యానించాడు. దీంతో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారంటూ క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకున్న డెసిషన్ తమకు ఎంతో బాధ కలిగిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. అయితే దేశం తరఫున రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ప్రొఫెషనల్ గ్రాండ్స్లామ్ అలాగే ATP టోర్నీల్లో మాత్రం బోపన్న కొనసాగనున్నాడు.
"దేశం తరఫున నేను ఆడే చివరి ఈవెంట్ ఇదే. నేనే స్థితిలో ఉన్నానో నాకు ఈ రోజు ర్థమైంది. ఇకపై వీలైనంత వరకూ టెన్నిస్ సర్క్యూట్ను ఆస్వాదిస్తూ సాగుతాను. రెండు దశాబ్దాల పాటు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. 2002 నుంచి ఇప్పటిదాకా భారత్కు ఆడుతూ వచ్చినందుకు నేనెంతో గర్వంగా ఉన్నాను" అంటూ బోపన్న ఓ ఎమోషనల్ ట్వీట్ షేర్ చేశాడు.
తొలి రౌండ్లో నిష్క్రమణ
పారిస్ ఒలింపిక్స్లో భాగంగా సోమవారం (జులై 29)న జరిగిన పురుషుల డబుల్స్లో శ్రీరామ్ బాలాజీతో కలిసి ఆడిన ఈ 44 ఏళ్ల స్టార్ ప్లేయర్, ఆఖరి వరకూ ఎంతో శ్రమించినప్పటికీ తొలి రౌండ్ కూడా దాటలేకపోయాడు. తమ ఆరంభ మ్యాచ్లోనే ఈ జోడీ 7-5, 6-2తో ఫ్రాన్స్కు చెందిన మోన్ఫిల్స్-రోజర్ వాజెలిన్ జంట చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.