తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి మరో విక్టరీ- గుజరాత్​పై విజయం - WPL 2025

ముంబయి ఖాతాలో మరో విజయం

WPL 2025
WPL 2025 (Woman Premiere League Twitter)

By ETV Bharat Sports Team

Published : Feb 18, 2025, 10:56 PM IST

WPL 2025 MI Vs GG :మహిళల ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 121 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ సీజన్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్రంట్‌ (57) అర్ధశతకంతో చెలరేగింది. మాథ్యూస్‌ (17), అమేలియా (19) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో గౌతమ్‌, ప్రియ చెరో 2 వికెట్లు పడగొట్టగా తనూజ ఒక వికెట్‌ తీసింది. అంతకుముందు గుజరాత్‌ 120 పరుగులకు ఆలౌటైంది. ముంబయి బౌలర్లలో మాథ్యూస్‌ 3 వికెట్లు తీయగా.. బ్రంట్, అమీలియా తలో 2, సిసోదియా, ఇస్మాయిల్‌ చెరో వికెట్‌ తీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details