Mohammed Shami About His Injury :టీమ్ఇండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం గాయం నుంచి రికవరీ అవుతున్నాడు. 2023 వన్డే వరల్డ్కప్ తర్వాత మోకాలికి సర్జరీ చేయించున్న షమీ, అప్పట్నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. ఇక పూర్తి ఫిట్నెస్ సాధించి, టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అతడి మోకాలిలో మళ్లీ సమస్య తలెత్తిందని, దీంతో షమీ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆడడం కష్టమేనని రీసెంట్గా వార్తలు వచ్చాయి. ఇది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ ప్రచారంపై షమీ స్పందించాడు. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశాడు.
'ఇలాంటి రూమర్స్ ఎందుకు ప్రచారం చేస్తారు? నేను రికవరీ అవ్వడానికి ఎంతో కష్టపడుతున్నా. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐగానీ, నేనుగానీ చెప్పలేదు. ఇలాంటి ఆధారాల్లేని వార్తలకు ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇటువంటి ఫేక్ రూమర్స్, అబద్ధాలను ప్రచారం చేయకండి' అని షమీ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
కాగా, ప్రస్తుతం షమీ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అయితే షమీ మోకాలికి కాస్త వాపు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి షమీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. 6 నుంచి 8 వారాల్లోపు షమీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వాలంటే డొమెస్టిక్ టోర్నీల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని నిబంధన ఉంది. మరి షమీ దేశవాళిలో ఆడతాడా? లేదా నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాడా అన్నది బీసీసీఐ నిర్ణయించాల్సి ఉంటుంది.