ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు కేంద్ర సాయం - ఎన్డీఏ నేతల హర్షం - NDA Leaders on Union Budget 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 9:02 PM IST

NDA Leaders on Union Budget 2024: కేంద్ర బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించడంపై ఎన్డీఏ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కోరినట్లు ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటోందని తెలిపారు. అమరావతికి 15 వేల కోట్లు బడ్జెట్​లో కేటాయించారని, రాజధానికి ఊతం ఇచ్చే విధంగా బడ్జెట్ ఉందని చెప్పారు.

NDA Leaders on Union Budget 2024
NDA Leaders on Union Budget 2024 (ETV Bharat)

NDA Leaders on Union Budget 2024 :కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి పెద్దపీట వేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ హర్షం వ్యక్తం చేశారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కేంద్రం బడ్జెట్​ను ప్రవేశ పెట్టిందని అభిప్రాయపడ్డారు. 9 కీలక అంశాలను మేళవించి బడ్జెట్ తయారు చేశారని, రాజధాని అమరావతి, పోలవరం అభివృద్ధికి బడ్జెట్​లో ప్రాధాన్యమిచ్చారని దినకర్ చెప్పారు. అమరావతికి 15 వేల కోట్లు బడ్జెట్​లో కేటాయించారని, రాజధానికి ఊతం ఇచ్చే విధంగా బడ్జెట్ ఉందని చెప్పారు. పోలవరం పూర్తి చేసేందుకు బడ్జెట్​లో హామీని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాజధానికి రూ. 15 వేల కోట్లు అప్పా? లేక గ్రాంటా? - నిర్మలా సీతారామన్‌ స్పష్టత - Budget 2024 for AP

వెనుకబడిన ప్రకాశం, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకుంటామని బడ్జెట్​లో హామీ ఇచ్చారని, కొప్పర్తి, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్​ల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయని దినకర్ చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్​పై ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నిజమయ్యాయని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనలో వాస్తవికతకు పెద్దపీట వేశారని, వృద్ధిరేటు 6.8 శాతం ఉంటుందని అంచనా వేశారని అన్నారు. యువత కోసం 2 లక్షల కోట్లతో 5రకాల పథకాలు రూపొందించారని, విద్యార్దులకు రూ.10 లక్షల వరకు విద్యారుణం కల్పించారని చెప్పారు. మహిళా సాధికారిత దిశగా వివిధ పథకాల కింద మహిళలకు 3 లక్షలు కేటాయింపు జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి ఆసరా ఇచ్చారని, గ్రామీణ ఉపాధి హామీ కింద 86 వేల కోట్ల రూపాయలను బడ్జెట్​లో కేటాయించారని ఆయన తెలిపారు.

రాష్ట్రానికి తోడ్పాటునిచ్చేలా కేంద్ర బడ్జెట్ - వెనకబడిన జిల్లాలకు బుందేల్​ఖండ్ తరహా ప్యాకేజీ: చంద్రబాబు - cbn comments on Budget

కేంద్ర బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించడంపై జనసేన పార్టీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,కోరినట్లు ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి, పోలవలం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం బడ్జెట్​లో ఎక్కువ నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయడంపై కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తోందని అన్నారు. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా జనసేన శాసన సభాపక్షం పని చేస్తుందని, ప్రజలు ఆశించినట్లే తాము అంకిత భావంతో రాష్ట్రాభివృద్ధికి పని చేస్తామని స్పష్టం చేశారు.

అమరావతికి కేంద్ర సాయం - ఆంధ్రప్రదేశ్​ నేతల హర్షం - tdp leaders on union budget 2024

ABOUT THE AUTHOR

...view details