తెలంగాణ

telangana

ETV Bharat / politics

ప్రాజెక్టుల పేరుతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాటకాలు ఆడుతున్నాయి : బూర నర్సయ్య - Boora Narsaiah on Congress BRS

Boora Narsaiah Goud On Vishwakarma Yojana Scheme : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విశ్వ కర్మ యోజన పథకంలో భాగంగా 18 కులవృత్తులకు సంబంధించిన లబ్ధిదారుల వెరిఫికేషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. పార్లమెంట్​ ఎన్నికల లబ్ధి కోసమే కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

Boora Narsaiah Goud about MP Elections
Boora Narsaiah Goud On Vishwakarma Yojana Scheme

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 8:29 PM IST

Boora Narsaiah Goud On Vishwakarma Yojana Scheme :రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ కర్మ యోజన పథకంలో భాగంగా 18 కులాలకు సంబంధించిన లక్ష 20 వేల మంది లబ్ధిదారులను వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల మందికి కూడా వెరిఫికేషన్ చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రాష్ట్రంలో లంకె బిందెలు లేవు ఖాళీ బిందెలు ఉన్నాయన్నారని గుర్తు చేసిన బూర నర్సయ్య గౌడ్, కేంద్ర ప్రభుత్వం లంకె బిందెలు ఇస్తుంటే ఎందుకు వెరిఫికేషన్ చేయించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తక్షణమే మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమై విశ్వకర్మ పథకంలో భాగంగా 18 కులాలకు సంబంధించిన వెరిఫికేషన్​కు ఆదేశించాలని బూర నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్​ ఎన్నికల కోడ్ రాకముందే వెరిఫికేషన్​ను పది రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్, బీఆర్​ఎస్​(BRS) నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ రెండు పార్టీలు పోటీ పడి తిట్టుకుంటున్నాయని ఆరోపించారు.

Boora Narsaiah Goud about MP Elections :ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లు గెలిపిస్తే, కృష్ణా, గోదావరి జలాల పంపిణీకీ శాశ్వత పరిష్కారం చుపుతామని, రాష్ట్రానికి అత్యధిక నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. బీఆర్​ఎస్​ దిల్లీలో లేదు గల్లీలో లేదన్నారు. బీఆర్​ఎస్​కు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని ఎద్దేవా చేశారు.

'ఏపీ రీఆర్గనైజేషన్​ యాక్ట్​ 2014లో జల వివాదం, ఆస్తుల పంపిణీ, అప్పుల పంపిణీ. ఇలా ప్రతి అంశానికి సంబంధించిన లిటిగేషన్​ అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం పెట్టడం వల్ల ప్రస్తుతం కృష్ణా జలాలపై ఈ దుస్థితి ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీ క్లియర్​ కట్​గా కృష్ణా ట్రైబ్యునల్​ బోర్డును ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసమే ప్రజల దృష్టి మళ్లించడానికి దీనిపై ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్పా మరొకటి లేదు'- బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ

ప్రాజెక్టుల పేరుతో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాటకాలు ఆడుతున్నాయి : బూర నర్సయ్య

'బీఆర్ఎస్‌లో కార్యకర్తలకు విలువ లేదు - అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది'

అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టారు : మంత్రి కోమటిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details