మీడియా దార్శనికుడైన రామోజీరావు, పాత్రికేయ, సినీ రంగాల్లో ఎందరికో స్ఫూర్తిదాతగా నిలిచారు. రాష్ట్ర, జాతీయ నేతలెందరో ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ సంతాపం తెలిపారు. రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని, పాత్రికేయ, సినీ రంగంపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. గతంలో రాష్ట్ర, జాతీయ నేతలతో రామోజీరావు మధుర జ్ఞాపకాల చిత్ర మాలిక. (ETV Bharat)