తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

తిరిగి ప్రారంభమైన పాపికొండల బోట్ ట్రిప్ - ఇప్పుడే బుక్ చేసుకోండిలా!

ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? - పాపికొండలు టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి!

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

PAPIKONDALU BOAT TRIP
Papikondalu Tourism (ETV Bharat)

Papikondalu Tourism :గోదారమ్మ ఒడిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండలు విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి. కానీ.. ఈ ఏడాది జులై నుంచి విహారయాత్రను నిలిపేసిన విషయం తెలిసిందే. దాంతో చాలా మంది పర్యాటకులు మళ్లీ పాపికొండల్లో విహారయాత్ర ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన పాపికొండలు టూర్​ను తిరిగి ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలు టూర్ పర్యాటకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా.. పాపికొండల మధ్య గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ఈ విహార యాత్ర ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. మీరు అలాంటి అందాలను ఆస్వాదించాలనుకుంటే.. పాపికొండలకు వెళ్లాల్సిందే. బోట్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రారంభించిన.. పాపికొండల టూర్​ ఇకపై రోజూ ఉంటుందని తెలిపింది ఏపీ టూరిజం శాఖ. అంతేకాదు.. పాపికొండల్లో ఒకట్రెండు రోజులు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని చెబుతున్నారు టూర్ నిర్వాహకులు.

ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోండిలా!

  • రాజమండ్రి నుంచి పాపికొండలు టూర్‌ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి గల పర్యాటకులుhttps://tourism.ap.gov.in/tours , www.aptourismrajahmundri.com వెబ్ సైట్లలో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
  • అదేవిధంగా.. రాజమండ్రి నుంచి ప్రైవేట్ బోట్ట్రిప్‌లు అందుబాటులో ఉంటాయి. రాజమండ్రి నుంచి గండిపోచమ్మ టెంపుల్ వరకు వాహనాల్లో తీసుకెళ్లి.. అక్కడి నుంచి 75 కిలోమీటర్లు లాంచీల్లో గోదావరిలో టూర్ కొనసాగుతుంది. మధ్యాహ్న సమయంలో పాపికొండల వద్దకు రీచ్ అవుతారు.
  • అక్కడ కొద్ది సమయం స్పెండ్ చేశాక.. తిరిగి బోటులో సాయంత్రానికి గండిపోచమ్మ టెంపుల్​కి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రికి తీసుకొస్తారు.

టూర్ ధర, కవర్ అయ్యే ప్రదేశాలు :

  • ఈ టూర్ ప్యాకేజీ ధర ఒక్కో వ్యక్తికి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. గండి పోచమ్మను దర్శించుకోవడంతో మీ టూర్ స్టార్ట్ అవుతుంది. నదికి ఇరువైపులా పాపికొండలు మధ్యలో సాగే లాంచీ ప్రయాణం.. మీకు మంచి అనుభూతినిస్తుంది.
  • ఈ టూర్​లో భాగంగా.. పాపికొండలు, పేరంటాలపల్లి ఆశ్రమం, ఆలయం, పోలవరం ప్రాజెక్ట్, దేవీపట్నం, కొరుటూరు కాటేజీలు, కొల్లూరు వెదురు గుడిసెలు వంటి అనేక ప్రాంతాలను వీక్షించవచ్చు.
  • అన్నింటికంటే ముఖ్యంగా ప్రయాణ సమయంలో లైఫ్ జాకెట్లు ధరించడం చాలా ముఖ్యం. అసౌకర్యంగా ఉన్నాయని వాటిని ధరించకపోతే.. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే విషాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిర్వాహకులు. కాబట్టి.. మీరు పాపికొండలు టూర్​కి ప్లాన్ చేస్తున్నట్లయితే.. ఇప్పుడే పైన చెప్పిన విధంగా బుక్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రకృతి అందాలను ఆస్వాదించండి!

ఇవీ చదవండి :

IRCTC దిల్లీ టూర్ - కృష్ణ జన్మభూమి మథురతోపాటు, మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!

హైదరాబాద్​ to అండమాన్ - ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ - ప్రకృతి ఒడిలో హాయిగా సేదతీరొచ్చు!

ABOUT THE AUTHOR

...view details