IRCTC Koffee With Karnataka Tour: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో కూర్గ్ ఒకటి. కూర్గ్ అందాలతోపాటు ఇతర ప్రకృతి అందాలు, పలు దేవాలయాలను దర్శించుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ టూరిజం "కాఫీ విత్ కర్ణాటక(Koffee with Karnataka)" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం ద్వారా ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో కూర్గ్, మైసూర్లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. టూర్ ప్రకటించిన తేదీల్లో ప్రతి బుధవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే.
- మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి కాచిగూడ-మైసూర్ ఎక్స్ప్రెస్(ట్రైన్ నెం - 12785)లో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 10 గంటలకు మైసూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి కూర్గ్ బయలుదేరుతారు. మధ్యాహ్నానికి కూర్గ్ చేరుకుని హోటల్లో చెకిన్ అవుతారు. ఆ తర్వాత Abbey ఫాల్స్ విజిట్ చేస్తారు. అలాగే ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకుని తిరిగి హోటల్కు చేరుకుంటారు. ఆ రాత్రికి కూర్గ్లోనే బస చేస్తారు.
- మూడో రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత తలా కావేరి(Talacauvery)కి వెళ్తారు. అక్కడ కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం రాజా సీట్ను విజిట్ చేస్తారు. ఆ రాత్రికీ కూర్గ్లోనే ఉంటారు.
- నాలుగో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ అయ్యి మైసూర్ బయలుదేరుతారు. మార్గమధ్యలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా విజిట్ చేస్తారు. ఆ తర్వాత మైసూర్ చేరుకుని హోటల్లో చెకిన్ అయ్యి బృందావన్ గార్డెన్స్ సందర్శిస్తారు. రాత్రికి మైసూర్లో వసతి ఉంటుంది.
- ఐదో రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి చాముండి హిల్స్, మైసూర్ ప్యాలెస్ విజిట్ చేస్తారు. మధ్యాహ్నం రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. మూడు గంటలకు మైసూర్ నుంచి హైదరాబాద్కు రిటర్న్ జర్నీ(ట్రైన్ నెం 12786) ఉంటుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ కంప్లీట్ అవుతుంది.
ధర వివరాలు చూస్తే:
1 నుంచి 3 ప్రయాణికులకు: