Israel Attack On Iran : తమ దేశంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ శనివారం టెహ్రాన్పై విరుచుకుపడింది. అయితే ఈ దాడిలో తమ వైమానిక దళానికి చెందిన నలుగురు చనిపోయినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ శనివారం రాత్రి వివరాలు వెల్లడించింది.
ఇరాన్ చేసిన క్షిపణి దాడులతో ప్రతీకారాగ్నితో రగిలిపోతున్న ఇజ్రాయెళ్, టెహ్రాన్లోని దాదాపు 20 లక్ష్యాలపై శనివారం తెల్లవారుజామున దాడులకు పాల్పడింది. దాదాపు 100 యుద్ధ విమానాలను ప్రయోగించి బాంబులు జారవిడిచింది. ఇరాన్కు చెందిన డ్రోన్ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో దక్షిణ టెహ్రాన్లోని ఓ డ్రోన్ ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే, ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల కారణంగా తమకు నష్టం స్వల్ప స్థాయిలోనే ఉందని ఇరాన్ వెల్లడించింది.