తెలంగాణ

telangana

ETV Bharat / business

నమితా థాపర్‌ Vs ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి - వారానికి 70 గంటల పని విధానంపై బిగ్ డిబేట్‌ - NAMITA THAPAR VS NARAYANA MURTHY

టన్నుల కొద్దీ డబ్బులు సంపాదించేవారు రోజంతా పని చేయండి - ఉద్యోగులను మాత్రం వదిలేయండి: నమితా థాపర్‌

Namita Thapar Vs Infosys Narayana Murthy
Namita Thapar Vs Infosys Narayana Murthy (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2024, 11:23 AM IST

Updated : Dec 22, 2024, 11:44 AM IST

Namita Thapar Vs Infosys Narayana Murthy : భారతదేశం ఆర్థికంగా ముందడుగు వేయాలంటే, యువతీ యువకులు వారానికి 70 గంటలపాటు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలను ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ సీఈవో నిమితా థాపర్‌ తీవ్రంగా ఖండించారు. ఎక్కువ గంటలు పని చేస్తే లాభాలు సంపాదించేది యజమానులే కానీ, ఉద్యోగులు కాదని ఆమె కుండ బద్దలు కొట్టారు. కనుక టన్నుల కొద్దీ డబ్బులు సంపాదించే యజమానులు - కావాలంటే ఎక్కువ గంటలు పని చేయవచ్చని, కానీ ఉద్యోగులపై ఆ భారం మోపకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.

హీట్ డిబేట్‌
భారతదేశ పని సంస్కృతి గురించి, వారానికి 70 గంటలపాటు పని చేయాలనే ఆలోచన గురించి ఇటీవల - ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ సీఈవో నిమితా థాపర్‌, షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్‌ మధ్య ఓ టీవీ సిరీస్‌లో పెద్ద డిబేట్ జరిగింది. పనికి, జీవితానికి మధ్య సమతుల్యత గురించి, దేశాభివృద్ధికి అవసరమైన ఉత్పాదకను పెంచడం గురించి వీరి మధ్య ఘాటైన చర్చ జరిగింది.

కష్టపడి పనిచేయాల్సిందే!
అనుపమ్ మిట్టల్ మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చేసిన ప్రతిపాదనలను సమర్థించారు. జీవితంలో ఏది సాధించాలన్నా కచ్చితంగా కష్టపడి పనిచేయాలని, పని గంటలను లెక్కలోకి తీసుకోకూడదని పేర్కొన్నారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు రోజుకు 16 గంటలు చొప్పున పనిచేశానని చెప్పారు. యువత కనుక పని గంటలను లెక్కించుకుంటే, జీవితంలో గొప్ప విజయాలేమీ సాధించలేరని అభిప్రాయపడ్డారు. ఏది సాధించాలన్నా గొప్ప అంకితభావం, కృషి ఉండాలని ఆయన సూచించారు.

తమ కంపెనీ (షాదీ.కామ్‌) హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పని చేసి గొప్ప విజయం సాధించిన అంశాన్ని అనుపమ్ మిట్టల్‌ గుర్తుచేశారు. పని-జీవితం మధ్య సమతౌల్యం అనే కాన్సెప్ట్‌ ప్రస్తుత యువతరాన్ని పూర్తిగా నాశనం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. విజయం, పోరాటం రెండూ ఒకదానితో మరొకటి కలిసి ఉంటాయన్నారు. కనుక యువత తమ లక్ష్య సాధన కోసం కెరీర్ ప్రారంభం నుంచే చాలా కష్టపడి పని చేయాలని సూచించారు.

ఉద్యోగులకు కలిగే లాభమేంటి?
అనుపమ్‌ మిట్టల్ చేసిన సూచనలతో, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చేసిన ప్రతిపాదనలతో నిమితా థాపర్‌ తీవ్రంగా విబేధించారు. వారానికి 70 గంటలు పని చేయాలనే వాదనను ఆమె తీవ్రంగా ఖండించారు. వాస్తవ జీవితంలో ఉద్యోగుల, యజమానుల పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగులు ఎక్కువ గంటలు పని చేస్తే - కచ్చితంగా కంపెనీ వ్యవస్థాపకులకు/ యజమానులకు/ బడా షేర్‌ హోల్డర్లకు భారీ ఎత్తున లాభాలు వస్తాయి. కానీ ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదని ఆమె తేల్చి చెప్పారు.

"టన్నుల కొద్దీ డబ్బులు సంపాదించే వ్యవస్థాపకులు, హై స్టేక్‌హోల్డర్లు కచ్చితంగా ఎక్కువ గంటలు పనిచేయండి. కావాలంటే 24 గంటలూ పనిచేయండి. కానీ సామాన్య స్త్రీ, పురుష ఉద్యోగులను వదిలేయండి. వారు కచ్చితంగా నిర్దేశిత గంటల పాటు పనిచేస్తారు. మీకు మంచి ఉత్పాదకతను అందిస్తారు. కానీ నాన్ స్టాండర్డ్‌గా, నాన్‌స్టాప్‌గా ఎక్కువ గంటలపాటు పని చేయించకూడదు. ఒక వేళ అలా పని చేయిస్తే, వారికి అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయే కానీ, ప్రత్యేకంగా ఎలాంటి ఆర్థిక లబ్ధి చేకూరదు." - నిమితా థాపర్‌, ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ సీఈవో

నమితా థాపర్ తన సొంత వ్యాపారానికి సంబంధించిన ఓ ఉదాహరణ కూడా చెప్పారు. 'ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్‌గా మారినప్పుడు దాని విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు. ఆ కంపెనీలో మాకు దాదాపు 80 శాతం వాటా ఉంది. కనుక మేము సహజంగానే రోజుకు 20 గంటలు పనిచేస్తాం. అందువల్ల పొందే లాభాలు కూడా మాకే దక్కుతాయి. కానీ మా కంపెనీలో పని చేసే గుమాస్తాకు ఆ డబ్బులు లేదా లాభాలు మేము పంచం. అంటే ప్రత్యేకంగా మా కంపెనీలో పని చేసే ఉద్యోగులకు అదనపు లబ్ధి చేకూరదు' అని నిక్కచ్చిగా వాస్తవ పరిస్థితులను ఆమె తెలియజేశారు.

వారానికి 70 గంటలు పనిచేస్తే - ధనికులయ్యేది ఉద్యోగులా? యజమానులా?

గొడ్డులమా? లేదా ఉద్యోగులమా? - వారానికి 70 గంటలు పనిచేయడానికి?

Last Updated : Dec 22, 2024, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details