Gurvinder Singh Padma Shree Award : వీల్ఛైర్కే పరిమితమైన ఓ వ్యక్తి దాదాపుగా రెండు దశాబ్దాలుగా ప్రజా సేవకు అంకితమయ్యారు. ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వందలాది మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆయన సమాజ సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్శశ్రీ అవార్డును ప్రకటించింది. ఆయనే హరియాణాలోని సిర్సా జిల్లాకు చెందిన గుర్వేందర్ సింగ్.
2012లో సిర్సా జిల్లాలో భాయ్ కన్హయా లాల్ పేరుతో ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు గుర్వేందర్ సింగ్. అందులో నిరుపేదలకు, వికలాంగులకు, రోగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 400 మంది వరకు ఉన్నారు. వారికి బెడ్, కూలర్, టీవీలతో పాటు చిన్న పిల్లలు ఆడుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే తాను ఈ విధంగా సామాజిక సేవ చేయటం మాత్రం 2005 నుంచే మొదలు పెట్టినట్లు గుర్వేందర్ సింగ్ చెప్పారు.
"2005 జనవరి 1 నుంచి సివిల్ ఆస్పత్రిలో రోగులకు పాలు పంపిణీ చేయటం ప్రారంభించాను. ఇంకా అలా సేవ చేస్తున్నానే ఉన్నాను. 1997 జూన్ 7న నాకు ప్రమాదం జరిగింది. అప్పుడు నన్ను డీఎంసీ ఆస్పత్రిలో చేర్చారు. అదే సమయంలో ఓ ఎన్జీఓ కొంత మంది రోగులకు పాలు, బ్రెడ్ పంపిణీ చేయటం చూశాను. అప్పుడే నేను కూడా సేవ చేయలని నిర్ణయించున్నాను. ఆ ప్రేరణతోనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాను."
--గుర్వేందర్ సింగ్, సామాజిక కార్యకర్త